Uppal Stadium: ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్న ఉప్పల్ స్టేడియం ప్రత్యేకతలు తెలుసా?

ఈరోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధం అయింది. మొదటి మ్యాచ్ హైదరాబాద్, రాజస్థాన్ ల మధ్య మరికొద్ది సేపటిలో  జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం చరిత్ర , ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.

New Update
hyd

Uppal Stadium, Hyderabad

ఈరోజు సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరగనుంది. ఉప్పల్‌ స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్‌ ఉంటాయి. 450 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పరిచారు. దీంతో పాటూ స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్‌ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, సెంట్స్, స్ప్రేలు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలను అనుమతించమని రాచకొండ సీపీ సుదీర్ బాబు చెప్పారు.

Also Read: USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్

అంతర్జాతీయ ప్రమాణాలతో..

ఉప్పల్ స్టేడియం అసలు పేరు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం. దీన్ని 2003లో నిర్మించారు. ఈ గ్రౌండ్ మొత్తం 16 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఉప్పల్ స్టేడియంలో దాదాపు 55,000 మంది కూర్చుని మ్యాచ్ చూడొచ్చు.  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ టీమ్  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హోమ్ గ్రౌండ్ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. స్టేడియంలో కార్పొరేట్ బాక్స్‌లు, ముఖ్యమంత్రి బాక్స్, వైఫైతో కూడిన విశాలమైన మీడియా గది ఉన్నాయి. అంతేకాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పేరుతో ఒక స్టాండ్ కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని 2019 డిసెంబర్ 6న ప్రారంభించారు. ఉప్పల్ స్టేడియం ఇప్పటి వరకు చాలా అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదిక అయింది.   టెస్ట్, వన్డే, టీ20...ఇలా అన్ని మ్యాచ్ లు ఇక్కడ అయ్యాయి.  ఈ స్టేడియం 2017, 2019 ఐపీఎల్ ఫైనల్స్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చింది.

 today-latest-news-in-telugu | uppal-stadium | ipl-2025

Also Read: IPL 2025: ఇవాళ హైదరాబాద్ లో  సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మొరిగే కుక్కలన్నీ ధోనీ ఆటను చూశాయనుకుంటున్నా: తమన్ పోస్ట్!

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు.

New Update
dhoni thaman

dhoni thaman

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని కింద విమర్శలు వస్తుండటంతో సమాధానంగా మరో ట్వీట్ చేశారు. ‘ఇది సీఎస్కే గెలుపు గురించి కాదు. దేశానికి ఎన్నో సిరీస్‌లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే’ అని పోస్టులో తమన్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఓ ఫోర్ ఉంది.  

ఉర్రూతలూగించిన ధోనీ 

అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా  18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) చివరి వరకూ పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చెన్నై ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

#telugu-news #sports #Chennai Super Kings #punjab-kings #PBKS vs CSK
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు