/rtv/media/media_files/2025/04/12/Nl4wqSjT3tz6hG9gs88k.jpg)
ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. అందులో ఇప్పటికే ఒక మ్యాచ్ ఇన్నింగ్స్ అయిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో లక్నో జట్టు ఘన విజయం సాధించింది. రెండవ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
మొదట ఓపెనర్లు క్రీజ్లోకి దిగిన నుంచి దూకుడుగా ఆడారు. స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. వారు అయిపోయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేస్తున్నాడు. వరుసగా ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు. అతి తక్కువ బాల్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
అతడు ఆచితూచి ఆడటమే కాకుండా.. కొట్టాల్సిన దగ్గర భారీ షాట్లు కొట్టి పరగులు రాబట్టాడు. 22 బంతుల్లో హాఫ్సెంచరీ చేశాడు. ఇక సెంచరీకి మరికొన్ని పరుగులే అవసరం. ఈ లోపే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (82) ఔట్ అయ్యాడు. కేవలం 36 బంతుల్లో ఈ పరుగులు సాధించి.. సెంచరీకి చేరువలో పెవిలియన్కు చేరాడు. దీంతో అతడు 100 పరుగులు చేస్తాడని ఆశించిన అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి.
(sports | IPL 2025 | srh-vs-pbks | latest-telugu-news | telugu-news)