Sanju Samson: రాజస్థాన్ కెప్టెన్ గా ఇకపై సంజూ..కీపింగ్ కు ఓకే..

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్ తిరిగి వచ్చేస్తున్నాడు. అతను పూర్తిగా ఫిట్ నెస్ సాధించడంతో కీపింగ్ కు ఓకే చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఇంపాక్టా ప్లేయర్ గా ఆడిన అతను ఇప్పుడు ఫుల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 

New Update
Sanju Samson

Sanju Samson Photograph: (Sanju Samson)

రాజస్థాన్ రాయల్స్ అసలు కెప్టెన్ సంజూ శాంసన్.  కానీ ఇప్పటివరకు అతను ఆ టీమ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగాడు. దానికి కారణం అతని చేతి వేలికి గాయమవడమే. ఇప్పుడు గాయం తగ్గింది. అతను పూర్తి పిట్ నెస్ తో ఉన్నాడు. అందుకే రాజస్థాన్ కెప్టెన్ బాధ్యతలు తిరిగి స్వీకరించనున్నాడు. అలాగే ఇక పై ఆ జట్టుకు కీపర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇక మీదట జట్టును ముందుండి నడిపించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికి ఆర్ ఆర్ జట్టకు కెప్టెన్ గా రియాన్ పరాగ్ వ్యవహరించాడు.

చేతి వేలికి గాయం, ఆపరేషన్..

ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సీరీస్ లో సంజూ శాంసన్ గాయపడ్డాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ అతని చేతి వేలికి గాయమైంది. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఎక్స్‌ప్రెస్ డెలివరీ శాంసన్ చూపుడు వేలికి బలంగా తగిలింది. విపరీతంగా రక్తస్రావం అయింది. అప్పటికి మ్యాచ్ కొనసాగించినా..తరువాత చేతి వేలికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. దాని తరువాత సంజూ పూర్తిగా కోలుకుని ఫిట్ నెస్ సాధించడానికి ఇంత టైమ్ పట్టింది. 

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండింటిలో ఓడిపోగా..ఒకదానిలో మాత్రమే గెలిచింది. ఆర్ఆర్ నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 5 పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. దీనిలో ెలా అయినా గెలిచి ఓటముల నుంచి బయటపడాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. ఇక మూడు మ్యాచ్ లలో సంజూ ఒక దానిలో మాత్రమే రాణించాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 66 పరుగులు చేశాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rajasthan-royals | sanju samson

Also Read: Heroine Ranya Rao: రన్యారావు నుంచి విడాకులు ఇప్పించండి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు