Rishabh Pant: విరాట్ - ధోనీకి రాని ఘనత రిషబ్ పంత్‌కు దక్కింది.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేటయ్యాడు. లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుకు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్‌ స్పోర్ట్‌ వెల్లడించింది. బెస్ట్‌ కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ విభాగంలో అతడిని నామినేట్‌ చేసినట్లు తెలిపింది.

New Update
 Laureus World Sports Awards 2025

Laureus World Sports Awards 2025

Laureus World Sports Awards 2025: టీమిండియా (Team India) స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ (Rishab Panth) కు అరుదైన ఘనత దక్కబోయే అవకావం కనిపిస్తోంది. అతడు తాజాగా ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. క్రీడా ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు అయిన లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ తాజాగా వెల్లడించింది. దీంతో ‘బెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు విభాగంలో పంత్ నామినేట్ అయ్యాడు. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ లారెస్‌ స్పోర్ట్‌ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. అయితే ఇప్పటి వరకు కేవలం 1 క్రికెటర్‌కి మాత్రమే ఈ అవార్డు లభించింది. ఆ ఆటగాడు మరెవరో కాదు సచిన్ టెండూల్కర్. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ లారస్ అవార్డుకు ఎంపికవ్వడం గమనార్హం. 

రిషబ్ పంత్ రియాక్షన్

దీనిపై రిషబ్ పంత్ తాజాగా స్పందించాడు. లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుకు తన పేరు నామినేట్‌ అవడం పట్ల పంత్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ దేవుడు మనకిచ్చిన వాటిపట్ల ఉంతో కృతజ్ఞతతో ఉండాలని తాను విశ్వసిస్తానని అన్నాడు. కారు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లిన తాను ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డానని గుర్తు చేసుకున్నాడు. 

Also read :  SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

ఇక ఆ తర్వాత నుంచి తనలో చాలా కసి పెరిగిందని అన్నాడు. తనలో మార్పులు వచ్చాయని.. గ్రౌండ్‌లో పరుగులు వరద పారించాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టానని.. టీమిండియాకు మళ్లీ ఆడాలనే కలను నెరవేర్చుకున్నానని తెలిపాడు.

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ఇందులో టీమిండియా తరఫున పంత్ 11వ ప్లేయర్‌గా కూడా ఆడే ఛాన్స్ లేకపోయింది. దీంతో బెంచ్‌పై కూర్చుని కనిపిస్తున్నాడు. పంత్ ఖచ్చితంగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియాలో భాగమే, అయినా అతనికి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. ఇంతలో అతడు ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అవడంతో రిషబ్ పంత్‌తో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచానికి చాలా శుభవార్త వచ్చింది. ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా పంత్ నిలిచాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs DC: 3 ఓవర్లకే 53 పరుగులు.. అంతలోనే RCBకి భారీ షాక్

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట ఇన్నింగ్ చేస్తున్న RCB దుమ్ము దులిపేస్తుంది. 3ఓవర్లలో 53 పరుగులు చేసింది. అంతలోనే ఓపెనర్ సాల్ట్ (37) స్టంప్ ఔట్ అయి పెవిలియన్‌కు చేరాడు.

New Update
RCB VS DC

RCB VS DC

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట ఇన్నింగ్ చేస్తున్న RCB దుమ్ము దులిపేస్తుంది. 3ఓవర్లలో 53 పరుగులు చేసింది. అంతలోనే సాల్ట్ (37) స్టంప్ ఔట్ అయి పెవిలియన్‌కు చేరాడు.

(dc | IPL 2025 | virat-kohli | latest technology news in telugu | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment