MI VS GT: ముంబైని చిత్తుచేసిన గుజరాత్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబైను గుజరాత్ టీమ్ చిత్తు చేసింది.  గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది.

New Update
ipl

GT Won The Match

పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ ఈసారి ఆరంభం నుంచే బోల్తా పడుతోంది. ఇప్పటికి జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో సీఎస్కే మీద మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని చేయలేకపోయింది. సూర్య కుమార్, తిలక్ వర్మ కష్టపడినా రోహిత్ తో సహా మిగతా బ్యాటర్లు అందరూ  తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో ముంబై మ్యాచ్ ఓడిపోయింది. సూర్యకుమార్ 49 పరుగులు చేసి చివర్లో క్యాచ్ ఇచ్చి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో గుజరాత్ ముంబై ఇండియన్స్ మీద 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. జీటీ బౌలర్స్ లో సిరాజ్ కు 2, ప్రసిధ్ కృష్ణ 2, సాయి కిశోర్ 1, రబడా 1  వికెట్లు వచ్చాయి. 

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్..

అహ్మదాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్‌ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లుగా వచ్చిన సాయి సుదర్శన్‌(63), శుభ్‌మన్‌ గిల్‌(38) జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 48 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దూకుడుగా ఆడుతుతున్న ఈ జోడీని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య విడదీశాడు. పాండ్య బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌కు క్యాచ్‌ ఇచ్చి గిల్ ఔటయ్యాడు.  ఆ తరువాత వచ్చిన జోస్‌ బట్లర్‌ (39) వరుస బౌండరీలతో హోరెత్తించాడు. 

సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ
 

మరో ఎండ్ లో సాయి సుదర్శన్‌ కూడా ముంబై బౌలర్లకు చిక్కకుండా బౌండరీలు బాదుతూ పరుగులు రాబాట్టాడు. దీంతో 11 ఓవర్లకు గుజరాత్ వంద మార్క్ దాటింది.  ఈ క్రమంలోనే సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  అనంతరం ముజీబుర్‌ రెహమాన్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన జోస్‌ బట్లర్‌ (39) వెనుదిరిగాడు.

 today-latest-news-in-telugu | ipl-2025 | mumbai-indians | gujarat

Also Read: USA: ట్రంప్ టారీఫ్ తలనొప్పులు...టాయిలెట్ పేపర్ కూ కరువు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket: ఈ ఏడాది టీమ్ ఇండియా షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ తర్వాత ఈ ఏడాది టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ ల షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. దీని ప్రకారం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు , నవంబర్‌ - డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. ఇవన్నీ స్వదేశంలోనే జరగనున్నాయి. 

New Update
bcci

bcci Photograph: (bcci )

ఈ ఏడాది భారత్ లోనే ఎక్కువ మ్యాచ్ లు ఆడనుంది టీమ్ ఇండియా క్రికెట్ జట్టు. విదేశీ జట్లే ఇక్కడకు రానున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా ఉన్న ఆటగాళ్ళు...దీని తర్వాత కొంత విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తరువాత నుంచి ఈ ఏడాదంతా వరుసగా సీరీస్ లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఏడాది చివరి వరకూ ఇక్కడే స్వదేశంలోనే సీరీస్ లు ఆడనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు , నవంబర్‌ - డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. ఇందులో ఒక మ్యాచ్ విశాఖలో కూడా జరగనుంది. దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఒక వన్డే మ్యాచ్ వైజాగ్ లో ఆడనుంది. 2003 తర్వాత భారత జట్టు మళ్ళీ ఇక్కడ మ్యాచ్ ఆడుతోంది. 

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ 

తొలి టెస్టు - అక్టోబర్ 2 - 6 (అహ్మదాబాద్‌) 
రెండో టెస్టు - అక్టోబర్ 10 - 14 (కోల్‌కతా)

సౌతాఫ్రికాతో సిరీస్‌ల వివరాలు 

తొలి టెస్టు - నవంబర్ 14-18 (దిల్లీ)
రెండో టెస్టు - నవంబర్ 22-26 (గువాహటి)

వన్డే వివరాలు..
 

తొలి వన్డే - నవంబర్ 30 (రాంచీ)
రెండో వన్డే - డిసెంబర్ 3 (రాయ్‌పూర్)
మూడో వన్డే - డిసెంబర్ 6 (విశాఖపట్నం) 

టీ 20..

తొలి టీ20 - డిసెంబరు 9 (కటక్‌)
రెండో టీ20 - డిసెంబరు 11 (ఛండీగడ్)
మూడో టీ20 - డిసెంబరు 14 (ధర్మశాల)
నాలుగో టీ20 - డిసెంబరు 17 (లఖ్‌నవూ)
ఐదో టీ20 - డిసెంబరు 19 (అహ్మదాబాద్)

 

today-latest-news-in-telugu | cricket | bcci | team-india | schedule

 

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు!

Advertisment
Advertisment
Advertisment