KKR vs RCB : టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోల్‌కతా బ్యాటింగ్!

ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.  

New Update
kkr vs  rcb

ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్  ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తుంది.  ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.  

KKR vs RCB హెడ్-టు-హెడ్ రికార్డు:

ఆడిన మ్యాచ్‌లు: 34
కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది: 20
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  గెలిచింది: 14

ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిస్తే, ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అత్యధిక విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును సమం చేస్తారు.  


కోల్‌కతా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.


బెంగళూరు  : ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

Also read :  IPL కోసం బిగ్గెస్ట్ 55 ఇంచుల స్మార్ట్‌టీవీ.. ఆఫర్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది. 

New Update
ipl

GT VS RR

గుజరాత్ ఇచ్చిన భారీ లక్ష్యం 217 పరుగులను సాధించడంలో సంజూ శాంసన్ టీమ్ తడబడింది.  దీంతో గుజరాత్ ఓటమన్నదే లేకుండా వరుసగా నాలుగో విజయ దక్కినట్టయింది. 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.  దీంతో 218 పరుగులతో ఆర్ఆర్ లక్ష్య ఛేదనకు దిగింది. కానీ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. హెట్ మయర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సెక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు బాదాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 26 మెరుపులు మెరిపించాడు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ను నిలబెట్టుకోలేకపోయారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ తీశారు. 

అదరగొట్టిన సాయి సుదర్శన్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెన్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బట్లర్, సాయి సుదర్శన్ కలిపి పరుగుల వరద పారించారు.  గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. ఇతనితో పాటూ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు,  షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | gujarath | rajasthan

Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు