Sports: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?

ప్రపంచంలో వివిధ దేశాలు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నప్పటికీ క్రీడల విషయంలో మాత్రం మానవులందరూ ఏకతాటి పైకి వస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న క్రీడ ఏంటో తెలుసా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Sports

Sports


ఆటలు ఆడటం ప్రతిఒక్కరి ముఖ్యమే. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం వస్తుంది. సాధారణంగా ప్రజలు అప్పడప్పుడు ఆటలు ఆడుతుంటారు. మరికొందరు వాటినే జీవనాధారంగా చేసుకుంటారు. వివిధ క్రీడల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు ఉన్నాయి. వివిధ దేశాలు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నప్పటికీ క్రీడల విషయంలో మాత్రం మానవులందరూ ఏకతాటి పైకి వస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న క్రీడ ఏంటో తెలుసా? ఇప్పుడు దీని గురించే తెలుసుకుందాం. 

Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్

ఫుట్‌బాల్ (సాకర్)

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఆదరిస్తున్న ఆట ఫుట్‌బాల్. ఈ క్రీడకు మొత్తం 400 కోట్ల మందికి పైగా అభిమానులు ఉన్నారు. దీనికి అభిమానులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఆట ప్రధాన టోర్నమెంట్లు ఫీఫా వరల్డ్ కప్, UEFA ఛాంపియన్స్ లీగ్, యూరో కప్, కోపా అమెరికా. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న దేశాలు బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా. 

క్రికెట్

భారత ఉపఖండంతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి దేశాలు ఎక్కువగా ఆదరించే ఆట క్రికెట్‌. దీనికి ప్రపంచవాప్తంగా 250 కోట్ల మందికి పైగా అభిమానులున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లో ఈ క్రీడకు ఎక్కువగా అభిమానులున్నారు. 

బాస్కెట్ బాల్

బాస్కెట్‌బాల్ అమెరికాలో ఎంతో ప్రాచూర్యం పొందిన ఆట. దీనికి 240 కోట్ల మంది అభిమానులున్నారు. ఈ ఆట ప్రధాన టోర్నమెంట్లు NBA, FIBA వరల్డ్ కప్, ఒలింపిక్స్. అమెరికాతో పాటు చైనా, ఫిలిప్పీన్స్, కెనడా, స్పెయిన్‌లో ఈ క్రీడకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. 

టెన్సీస్

టెన్నీస్‌ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అభిమానులున్నారు. ఇది వ్యక్తిగత ఆటగాళ్ల మధ్య జరిగే కఠినమైన క్రీడల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని ప్రధాన టోర్నమెంట్లు వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్. 

హాకీ

హాకీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనికి 50 కోట్ల మంది అభిమానులున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, యూరోప్ దేశాల్లో ఈ క్రీడకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీని ప్రధాన టోర్నమెంట్లు FIH వరల్డ్‌ కప్, ఒలింపిక్స్, హాకీ ఇండియా లీగ్. 

telugu-news | national-news | sports | football | cricket

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు?

New Update
ipl

Priyansh Arya

నిన్న ముల్లాపూర్ లో సొంత మైదానంలో చెన్నైతో తలపడింది పంజాబ్ కింగ్స్. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎనిమిది ఒవర్లలోనే ఐదు వికెట్లు పడిపోయాయి. కానీ ఒక కుర్రాడు మాత్రం ఫీల్డ్ ను అతుక్కుని ఉండిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు చెక్కుచెదరకుండా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కే బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ కుర్రాడే ప్రియాంశ్ ఆర్య. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేసి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యంత ప్రమాదకరమైన పతిరన బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి వారెవ్వా అనిపించాడు. 

ఢిల్లీ కుర్రాడు..
 

24 ఏళ్ళ ప్రియాంశ్ ఆర్య ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దేశావాళీల్లో కూడా పాతిక మించి ఆడి ఉండడు. కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు.  ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రియాంశ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దేశవాళీలో కూడా ఢిల్లీ తరుఫునే ఆడాడు. 2021/22 సీజన్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్‌ కేవలం 7 లిస్ట్‌ - A మ్యాచులు ఆడాడు. అతడు చేసిన పరుగులు 77 మాత్రమే. దేశవాళీల్లో టీ 20ల్లో 22 మ్యాచుల్లో 731 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్‌ దిల్లీ స్ట్రైకర్‌పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేసిన ఆర్య ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ పై 102 పరుగులతో చితక్కొట్టాడు. వీటితో వెలుగులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఇతనిని రూ.3.80 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. 

ఐపీఎల్ లో ..

ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ నాలుగు  మ్యాచ్ లు ఆడింది.  మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 22 బంతుల్లో 47 పరుగులు చేసి తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. భారీ మొత్తాన్ని వెచ్చించి ఎందుకు కొనక్కున్నారో చేసి చూపించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో 8, 0 పరుగులతో తేలిపోయాడు. కానీ నిన్న ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు. ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | punjab-kings 

Also Read: Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

Advertisment
Advertisment
Advertisment