Rishab Pant: లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా పంత్

ఐపీఎల్‌‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు ఆ ఫాంఛైజీ తెలిపింది. గతేడాది నవంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఇందులో పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు రిషబ్‌ను సొంతం చేసుకుంది.

New Update
Lucknow captian rishab pant

Lucknow captian rishab pant Photograph: (Lucknow captian rishab pant)

టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్‌‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు రిషబ్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో లక్నో రూ.27 కోట్లకు పంత్‌ను దక్కించుకుంది.

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!

మొదటిసారి పంత్ ఐపీఎల్ ఎప్పుడు ఆడాడంటే? 

రిషబ్ పంత్ ఇంతకు ముందు ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గత సీజన్ ఐపీఎల్‌లో అతను అంతగా టీమ్‌ను ముందుకు నడిపించలేదు. మరి ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. రిషబ్ పంత్ 2016లో మొదటిసారి ఐపీఎల్ ఆడాడు. మొత్తం 111 మ్యాచ్‌లలో 3284 రన్స్ చేశాడు. అయితే అత్యధికంగా 2018 సీజన్‌లో 684 రన్స్ చేశాడు. 

ఇదిలా ఉండగా రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా ఉన్న సమయంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో 2023 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గతేడాది మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా ఉన్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment