IPL 2025లో ముంబై చెత్త రికార్డు.. ఐపీఎల్ లోనే ఏ జట్టుకూ లేని!

ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. దీంతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.  2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ లో ముంబై గెలవలేదు.

New Update
mi vs csk record

ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. ఆదివారం చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీనితో, ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అది ఏంటంటే వరుసగా 13వ ఏడాది కూడా ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ను ఓటమితోనే షురూ చేసింది.  2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభిస్తూ వచ్చింది. చివరిసారిగా 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై తమ సీజన్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. 2013 నుండి వరుసగా తొలి మ్యాచ్ లో ఓటములను చవిచూస్తోంది. అయితే ఐపీఎల్ లో ఇలాంటి రికార్డు మరే టీమ్ కూడా లేదు.  

Also read :  BCCI కీలక ప్రకటన..మహిళా క్రికెటర్లకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌!

Also Read :  కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్‌ నేతలు

మ్యాచ్‌లో ఏం జరిగింది?

చిదంబరం స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్‌తో  జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.  తిలక్ వర్మ 31, సూర్యకుమార్ యాదవ్ 29, దీపక్ చాహర్ 28 పరుగులు చేశారు. చెన్నై తరఫున నూర్ అహ్మద్ 4 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు.టార్గెట్ కోసం బరిలోకి దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. రచిన్ రవీంద్ర అజేయంగా 65 పరుగులు చేయగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులు చేశాడు. చెన్నై తదుపరి మ్యాచ్‌లో మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది, ముంబై ఇండియన్స్ మార్చి 29న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. 

Also read :  Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో!

Also Read :  కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!

 

ipl-2025 | chennai-super-kings | mumbai-indians | latest-telugu-news | today-news-in-telugu | telugu-cricket-news | telugu-sports-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్

2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 జట్లు కూడా ఆడుతాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతాయి. పాక్‌కు ఛాన్స్ లేదు.

New Update
LOS ANGELES CRICKET

LOS ANGELES CRICKET Photograph: (LOS ANGELES CRICKET)

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో కేవలం 6 జట్లు మాత్రమే పాల్గొంటాయి. మెన్స్, ఉమెన్స్ జట్లు కూడా ఆడుతాయి. ఇందులో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు పాల్గొంటాయి. అయితే అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఈ జట్లను ఫైనల్ చేశారు. ఈ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జట్టుకు ఛాన్స్ లేదు. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం 13,845 పాయింట్లు పాకిస్థాన్‌కి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో చోటు సంపాదించుకోలేదు.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఇది కూడా చూడండి:  Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ర్యాంకింగ్స్ ఇవే

టీమిండియా– 20170
ఆస్ట్రేలియా – 12417
ఇంగ్లాండ్ – 12688
న్యూజిలాండ్ – 14652
వెస్టిండీస్ – 14587
దక్షిణాఫ్రికా – 11345

Advertisment
Advertisment
Advertisment