KKR Vs LSG: రహానె రాణించినా.. ఉత్కంఠ పోరులో పంత్ దే పైచేయి!

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లఖ్‌ నవూ నిర్దేశించిన 239 పరుగుల చేధించలేక కేకేఆర్ చతికిలపడింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించినా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది.

New Update
lsg kkr

IPL 2025 Lucknow Supergiants win against Kolkata Knight Riders

KKR Vs LSG: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లఖ్‌ నవూ నిర్దేశించిన 239 పరుగుల చేధించలేక కేకేఆర్ చతికిలపడింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించినా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది.

ఒపెనర్ల విధ్వంసం..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్‌ (81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) నాలుగో అర్ధ శతకం చేశాడు. నికోలస్ పూరన్ (87*; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. మార్‌క్రమ్ (47; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ తీశారు. 

ఇక కోల్‌కతా ఓపెనర్లు డికాక్‌ 15(9), సునీల్‌ నరైన్‌ 30 (13) ధాటిగా ఆరంభించారు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కెప్టెన్‌ రహానె 61 (35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్‌ అయ్యర్‌ 45 (29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కానీ రమణదీప్‌ సింగ్‌ (1), రఘువంశీ (5), రస్సెల్‌ (7) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. రింకూ సింగ్‌ 38 (15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత్‌ రాణా 10 (9 బంతుల్లో 2 ఫోర్లు) చివరిలో మెరుపులు మెరిపించిన ఫలితం లేకుండా పోయింది. లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో 2 వికెట్లు తీయగా, అవేశ్‌ఖాన్‌, దిగ్వేష్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

IPL 2025 | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చెన్నై ఓటమి.. గుక్క పెట్టి ఏడ్చిన స్టార్ హీరోయిన్

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోవడంతో హీరోయిన్ శృతి హాసన్ ఏడ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Heroine Shruti Hassan

Heroine Shruti Hassan

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌కు హీరోయిన్ శృతి హాసన్ వెళ్లింది. సీఎస్కే ఓటమిని తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో శృతి హాసన్ సీఎస్కే జట్టుకు డైహార్డ్ ఫ్యాన్ అని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

సన్‌రైజర్స్ విజయం..

ఐపీఎల్‌లో భాగంగా CSK VS SRH మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయింది. మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.  

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు