/rtv/media/media_files/2025/03/30/FzaIBF2lvSKBeNk1JjnM.jpg)
IPL 2025 Hyderabad Vs Delhi match in Visakhapatnam
IPL 2025: ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ఓడిన హైదరాబాద్ ఢిల్లీపై గెలిచి పోరులో నిలవాలని భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్లో లఖ్నవూపై నెగ్గిన ఢిల్లీ మంచి జోష్లో కనిపిస్తోంది. స్టార్క్ నేతృత్వంలోని ఢిల్లీ బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను వణింకించాలని చూస్తున్నారు. కేఎల్ రాహుల్ సైతం జట్టులోకి వస్తుండగా ఢిల్లీ బ్యాటింగ్ విభాగం మరింత బలపడనుంది.
సన్ రైజర్స్ కు అతిపెద్ద తలనొప్పి..
ఇక హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్తో పాటు మహ్మద్ షమి ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇది సన్ రైజర్స్ కు అతిపెద్ద తలనొప్పిగా మారింది. బ్యాటింగ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే హైదరాబాద్ బ్యాటర్లు గత మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యారు. షాట్లకు అవకాశం ఇవ్వని బౌలింగ్తో సన్రైజర్స్ భీకర బ్యాటింగ్ లైనప్కు లఖ్నవూ కళ్లెం వేయగా ఢిల్లీ కూడా అదే పని చేయాలని చూస్తోంది.
పాస్ ల గొడవ..
ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో తలనొప్పి మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఇప్పుడు అది మరో వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ను హెచ్ సీఏ తీవ్రంగా వేధిస్తోందట. ఈ బాధలు ఎస్ఆర్ హెచ్ పడలేకపోతోంది. దీనికి తోడు కోరినన్ని పాస్ లు ఇవ్వలేదని ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్కు హెచ్ సీఏ తాళాలు కూడా వేసిందని సన్ రైజర్స్ చెబుతోంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హెచ్సీఏ కోశాధికారికి సన్రైజర్స్ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ బాధలు ఇక పడలేమని...అందుకే తాము హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోతామని సన్ రైజర్స్ చెబుతోంది.
: ipl-2025 | delhi | telugu-news | today telugu news
Rohit Sharma: నా క్యారెక్టర్ మారింది.. మైండ్సెట్ కాదు.. హిట్ మ్యాన్ సంచలన కామెంట్స్!
ముంబై ఇండియన్స్తో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. అయితే పాత్రలు మారుతున్నా తన మైండ్సెట్ మాత్రం అసలే మారలేదన్నాడు.
Rohit Sharma interesting comments on Mumbai Indians
Rohit Sharma: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్తో తనకున్న అనుబంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ముంబైకి కెప్టెన్గా, మిడిలార్డర్, ఇప్పుడు ఓపెనర్ బ్యాటర్గా పరిస్థితులకు అనుగుణంగా తనను మార్చుకున్నట్లు తెలిపాడు. అయితే తన పాత్రలు మారుతూ వస్తున్నాయి కానీ.. తన మైండ్సెట్ మాత్రం అసలే మారలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏం చేయాలో అదే చేస్తున్నా..
ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమ్ కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఇందులో ఏ మార్ప లేదు. మ్యాచ్ గెలవాలి. ట్రోఫీలు సొంతం చేసుకోవడంపైనే ఫోకస్ ఉంటుంది. ముంబై ఇండియన్స్కు ఇదంతా తెలుసు. కొన్నేళ్లుగా చాలా ట్రోఫీలను గెలుచుకున్నాం. విజేతలుగా నిలుస్తున్నాం. ముంబై ఇండియన్స్ కల్చర్ ఏంటో అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మా టార్గెట్ ఐపీఎల్ ట్రోఫీ సాధించడమే. మళ్లీ ముంబై ఇండియన్స్కు పూర్వ వైభవం తీసుకురావడమే అన్నాడు.\
Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?
ఇక ముంబైలో విదేశీ క్రికెటర్ల గురించి మాట్లాడుతూ.. ట్రెంట్ బౌల్ట్కు ఎంతో అనుభవం ఉందన్నాడు.మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ సారథి క్లాస్ ప్లేయర్ అని చెప్పాడు. విల్ జాక్స్, రీస్ టోప్లేతో జట్టులో వైవిధ్యం తీసుకొచ్చాం. రియాన్ రికెల్టన్ యువ క్రికెటర్ దూకుడుతోపాటు నిలకడగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. భారత యువ ప్లేయర్లు ముంబైలో చాలామంది ఉన్నారు. వారితో కలిసి ఆడటం చాలా బాగుంటుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’
rohit-sharma | mumbai-indians | telugu-news
Bird Flu : హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం...శాంపిల్స్లో షాకింగ్న్యూస్
Toor Dal: కందిపప్పు ఒరిజినలా లేక నకిలీనా ఇలా గుర్తించండి
Jewelry: స్నేహితులకు వేసుకోవడానికి నగలు ఇస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
TGBIE: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. అప్పటి నుంచే వేసవి సెలవులు
Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ