BCCI: ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఆ ఇద్దరు ఔట్!

ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జంబో సపోర్ట్‌ స్టాఫ్‌ను ఇంగ్లాండు పంపించేందుకు ఆసక్తి చూపించట్లేదట. హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో మార్చి 29న నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

New Update
bcci rohit sharma

India tour of England

BCCI:  భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ టోర్నీ అనంతరం టీమ్ ఇండియా  ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనుంది. అయితే ఈ  పర్యటనకు ముందు సహాయక స్టాఫ్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జంబో సపోర్ట్‌ స్టాఫ్‌ను ఇంగ్లాండు పంపించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించట్లేదట. 

 ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు ఔట్..

ఈ మేరకు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా, చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ మార్చి 29న గువాహటిలో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారట. అయితే రాహుల్ ద్రవిడ్‌ తర్వాత  కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. తనకు సహాయంగా  ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు, బౌలింగ్‌ కోచ్‌ను తీసుకున్నాడు.  రైన్ టెన్ డస్కతే, అభిషేక్ నాయర్‌లు అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించుకున్నారు. ఫీల్డింగ్‌ కోచ్‌గా దిలీప్‌ను కొనసాగిస్తున్నారు. బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కోటక్‌ ఉన్నారు. అయితే వీరంతా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ ను విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ! 

అయితే ఇంగ్లాండ్‌ పర్యటనకు ప్రత్యేకంగా అసిస్టెంట్‌ కోచ్, ఫీల్డింగ్‌ కోచ్‌ అవసరం లేదని బీసీసీఐ భావిస్తోందట. అభిషేక్ నాయర్, దిలీప్‌ను పక్కన పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.  సితాన్షు, మోర్నీ మోర్కెల్ ను కొనసాగించనున్నారట. ఇదంతా కూడా గౌతమ్ గంభీర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని, బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు

england | india | today telugu news | rtv telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS RR: చివర వరకూ సా...గిన మ్యాచ్..రాజస్థాన్ కు మొదటి గెలుపు

మామూలుగా టీ20ల్లో 11 లేదా అయ్యేసరికి మ్యాచ్ ఉవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కానీ ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మ్యాచ్ మాత్రం సాగతీతలా అయింది. 15 ఓవర్లు అయినా కూడా ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టమైంది. చివర వరకూ సా...గిన మ్యాచ్ లో ఆర్ఆర్ విజయం సాధించింది.

New Update
ipl

CSK VS RR

రాజస్థాన్ రాయల్స్ కు మొదటి గెలుపు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గువాహటిలో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయిన ఆర్ఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ టీమ్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి సీఎస్కేకు 184 లక్ష్యాన్ని ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన చెన్నై బ్యాటర్లకు మొదటి ఓవర్లోనే ఝలక్ తగిలింది.  మూడో బంతికే సీఎస్కే తన మొదటి వికెట్ ను కోల్పోయింది. తరువాత కూడా చాలా తొందరగానే మరో రెండు వికెట్లు పడిపోయాయి. రచిన్ రవీంద్ర 0, రాహుల్ త్రిపాఠీ 23, శివమ్ దూబే 18, విజయ్ శంకర్ 9లు వరుసగా అవుట్ అయిపోయారు. కానీ చెన్నై కెప్టెన్ రుతురాజ్ మాత్రం పట్టుదలగా ఆడాడు. వికెట్లు పడిపోతున్నా అవతలి ఎండ్ లో నిలబడి బ్యాటింగ్ చేశాడు.  63పరుగులు చేసి టీమ్ గెలిపించడానికి కష్టపడ్డాడు. అసలు ఈరోజు మ్యాచ్ చివర వరకూ సాగింది. చివర వరకు ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమైంది. 19వ ఓవర్లో కూడా చెన్నై మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపించాయి. కానీ 19 ఓవర్లో సందీప్ బౌలింగ్ లో ధోని అవుట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఆర్ఆర్ సొంతమైంది. ఆర్ఆర్ టీమ్ లో ఈరోజు బ్యటార్లలో నితీశ్ రాణా హీరో అయితే బౌలర్లలో హసరంగ హీరో. నాలుగు వికెట్లు తీయడమే కాక చాలా ముఖ్యమైన బ్యాటర్లను అవుట్ చేశాడు.  మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ ఆరుపరుగుల తేడాతో విజయం సాధించింది. 

మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్..

గువాహటి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా(81), రియాన్‌ పరాగ్‌ (37), సంజుశాంసన్‌ (20), హిట్‌ మయర్‌ (19) ఫర్వాలేదనిపించగా..  మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి బంతికే ఫోర్‌ బాది మంచి ఊపుమీద కనిపించిన ఓపెపర్  జైస్వాల్‌ (4) వెంటనే ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణాతో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు సంజుశాంసన్‌. ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశారు.  ఈ క్రమంలోనే  21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. 

రియాన్‌ పరాగ్‌ భారీ షాట్లతో..

మంచి ఊపుమీదున్న రాజస్థాన్ కు నూర్‌అహ్మద్‌ బిగ్‌ షాక్ ఇచ్చాడు. అతని బౌలింగ్ లో  రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి సంజు శాంసన్‌ (20) వెనుదిరిగాడు. దీంతో వీరి 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోపక్కా నితీశ్‌ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో 81 పరుగుల వద్ద..  భారీ షాట్‌ కొట్టేందుకు ముందుకు వచ్చి ధోనీ స్టంపింగ్‌ కు దొరికిపోయాడు.  కేవలం 36 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు నితీశ్‌ రాణా. అనంతరం  ధ్రువ్‌ జురేల్‌ (3),  హసరంగ (4) వెనువెంటనే ఔట్‌ అయ్యారు. దీంతో  రాజస్థాన్ కష్టాల్లో పడింది. చివర్లో రియాన్‌ పరాగ్‌ (37) భారీ షాట్లతో అలరించడంతో రాజస్థాన్ భారీ  చేసింది. చెన్నై  బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీయగా.. మథీష పతిరానా మూడు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | ipl-2025 | csk | match 

Also Read:Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment