Cricket: నేటి నుంచే ఇంగ్లాండ్- భారత్ టీ 20 సిరీస్

ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది. 

New Update
cricket

India Vs England



వరుస పరాజయాలు టీమ్ ఇండియాను డీలా చేశాయి. ఘోర అపజయాలు అవమానాలకు దారి తీసింది. ఆ చేదు జ్ఞాపకాలను వీలైనంత తొందరగా చెరిపేయాలని అనుకుంటోంది భారత జట్టు. టీ20 ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌ సొంతగడ్డపై పరీక్షకు సిద్ధమైంది. ఈ రోజు నుంచే ఇంగ్లాండ్ తో అయిదు మ్యాచ్ ల టీ20 సీరీస్ ఆడనుంది టీమ్ ఇండియా. సూర్యకుమార్ కెప్టెన్సీలో కుర్ర జట్టు బరిలోకి దిగుతోంది. 

5 టీ20లు, 3 వన్డేలు...

ఇంగ్లాండ్ తో..టీమ్ ఇండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఇవన్నీ ఇక్కడే భారత్ లో జరగనున్నాయి. ఈ రోజు నుంచే ఈ సమరానికి తెర లేస్తోంది. కోలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్, ఇంగ్లాండ్ జట్లు మొదటి మ్యాచ్ ఆడనున్నాయి. చెన్నై (25న), రాజ్‌కోట్‌ (28), పుణె (31), ముంబయి (ఫిబ్రవరి 2న) వరుసగా తర్వాతి మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీని తరువాత మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ కూడా ఇంగ్లాండ్ తో ఆడనుంది. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాని ముందు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే రెండు సీరీస్ లేు గెలవడం టీమ్ ఇండియాకు చాలా ముఖ్యం. దానికి తోడు బీసీసీఐ ఇందులో కుర్రాళ్ళతో ప్రయోగాలు చేస్తోంది. దానిని బట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిని బరిలోకి దింపాలన్నది నిర్ణయించనుంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 12 వరకు జట్టును మార్చే అవకాశం ఉంటుంది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, సంజూ శాంసన్ లాంటి వారికి జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పుడు కనుక వీరిద్దరూ ఇంగ్లాండ్ తో జరిగే సీరీస్‌లో బాగా ఆడితే తుది జట్టులోకి ఎంపిక చేసే ఛాన్స్ లు చాలా బలంగా ఉన్నాయి. 

మరోవైపు టీ20ల్లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ గా ఉంది. దానిని ఢీకొనడం అంత తేలికేమీ కాదు. అయితే ప్రస్తుతం ఉన్న టీమ్ ఇండియా కుర్రాళ్ళ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. టెస్ట్ ల్లో ఫెయిలయినా...టీ20ల్లో నిలకడగానే ాడుతున్నారు. నిజం చెప్పాలంటే అద్భుతాలు చేస్తున్నారు. అలాగే వన్డేల్లో కూడా దుమ్ము రేగ్గొట్టే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్ ను మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరోవైపు ఈ సీరీస్ లో బ్యాటర్ సంజూ శాంసన్ కీపర్గా వ్యవహరించనున్నాడు. ఇతను సక్సెస్ అయితే ఇతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 

Also Read: USA: గుబులు గుబులుగా భారతీయులు..తిరుగుటపా తప్పదేమో..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment