India Vs New Zealand: భారత్ ఘన విజయం.. పోరాడి ఓడిన కివీస్

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 250 టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది.

New Update
India Vs New Zealand Champions Trophy 2025.

India Vs New Zealand Champions Trophy 2025.

భారత్ vs న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్‌ను ఆలౌట్ చేసి.. 44 పరుగుల తేడాతో గెలుపొందింది. కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్‌సన్ అదరగొట్టేశాడు. ఫోర్లు సిక్సర్లతో ఔరా అనిపించాడు. 120 బంతుల్లో 81 పరుగులు చేసి ఒక్కడే పోరాడాడు. మిగిలిన విల్ యంగ్ (22) , డారిల్ మిచెల్‌ (17) పరుగులు, టామ్ లేథమ్ (14) పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ (12)పరుగులు, రచిన్ రవీంద్ర (6)పరుగులు పరుగులు చేశారు.

టీమిండియా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి అదరగొట్టేశాడు. ఒక్కడే 5 వికెట్లు తీసి అట్రాక్షన్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో కుల్‌దీప్ 2, హార్దిక్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో ఒక్కో వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 250 టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ క్రమంలో 45.3 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 

ఇది కూడా చూడండి: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

శ్రేయస్ అదరహో

ఇక భారత్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టేశాడు.98 బంతుల్లో 79 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో హైయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే అక్షర్ పటేల్ సైతం మెరుపు ఇన్సింగ్‌తో ఆకట్టుకున్నాడు. 61 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో రాణించాడు.

ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

హార్దిక్ పాండ్య రచ్చ

ఇక చివర్లో హార్దిక్ పాండ్య అయితే రచ్చ రచ్చ చేశాడు. పరుగుల వర్షం కురిపించాడు. 45 బంతుల్లో 45 పరుగులు సాధించి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక కేఎల్ రాహుల్ (23), జడేజా (16) పరుగులు సాధించారు. రోహిత్ శర్మ (15) పరుగులు, శుభ్‌మన్ గిల్ (2) పరుగులు, విరాట్ కోహ్లీ (11) పరుగులతో అభిమానులను నిరాశపరిచారు. ఆట ప్రారంభమయ్యే సమయంలో భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది. 

New Update
ipl

GT VS RR

గుజరాత్ ఇచ్చిన భారీ లక్ష్యం 217 పరుగులను సాధించడంలో సంజూ శాంసన్ టీమ్ తడబడింది.  దీంతో గుజరాత్ ఓటమన్నదే లేకుండా వరుసగా నాలుగో విజయ దక్కినట్టయింది. 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.  దీంతో 218 పరుగులతో ఆర్ఆర్ లక్ష్య ఛేదనకు దిగింది. కానీ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. హెట్ మయర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సెక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు బాదాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 26 మెరుపులు మెరిపించాడు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ను నిలబెట్టుకోలేకపోయారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ తీశారు. 

అదరగొట్టిన సాయి సుదర్శన్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెన్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బట్లర్, సాయి సుదర్శన్ కలిపి పరుగుల వరద పారించారు.  గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. ఇతనితో పాటూ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు,  షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | gujarath | rajasthan

Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment