ICC AWARDS 2024: టెస్టుల్లో ఈ ఇద్దరికే.. వన్డేల్లో ఒక్కరు లేరు!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 అవార్డ్స్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11మంది పురుషులు, మహిళా ప్లేయర్ల లిస్ట్‌ రిలీజ్ చేసింది. జైస్వాల్, జడేజా, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు.

New Update
icc 2024

ICC AWARDS 2024 men and women cricketers list

ICC AWARDS 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 అవార్డ్స్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ఈ ఏడాది టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11మంది ఇంటర్నేషనల్ ప్లేయర్ల లిస్ట్‌తో పాటు icc ఎంపిక చేసిన జట్టుకు కెప్టెన్‌ను నియమించింది. 

ఈ మేరకు ఐసీసీ ఓటింగ్ అకాడమీ - గణాంకాలు, ఈ క్యాలెండర్ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించిన సగటు, విజయాల ఆధారంగా పురుషులు, మహిళ ఆటగాళ్లను ఎంపిక చేశారు. 

ICC పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్:

1. యశస్వి జైస్వాల్ (ఇండియా)
2. రవీంద్ర జడేజా (ఇండియా)
3. ప్యాట్ కమిన్స్ (కెప్టెన్, ఆస్ట్రేలియా)

ICC మహిళల ODI టీమ్ ఆఫ్ ద ఇయర్:
1. స్మృతి మంధాన (ఇండియా)
2. దీప్తి శర్మ (ఇండియా)
3. లారా (కెప్టెన్, సౌతాఫ్రికా)

పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్:
1. చరిత్ అసలంక కెప్టెన్ (కెప్టెన్, శ్రీలంక)

ICC ఓటింగ్ అకాడమీ
జహీర్ ఆడమ్స్, షోయబ్ అహ్మద్, ఆండ్రూ ఆల్డర్సన్, అథర్ అలీ ఖాన్, ఎలిజబెత్ అమ్మోన్, రస్సెల్ ఆర్నాల్డ్, డాన్ బెస్విక్, ఇయాన్ బిషప్, రెక్స్ క్లెమెంటైన్, రోరీ డాలర్డ్, మెల్ ఫారెల్, డారెన్ గంగా, నటాలీ జర్మనోస్, ఎస్ గోమేష్, విక్రాంత్ గుప్తా, షాహల్‌హర్ష్మీ హాతీ, నాసర్ హుస్సేన్, మహ్మద్ ఇసామ్, ఐసోబెల్ జాయిస్, ఫైసల్ కమల్, స్టేసీ ఆన్ కింగ్, ఫైసన్ లఖానీ, ఆండ్రూ లియోనార్డ్, కేటీ మార్టిన్, మ్పుమెలెలో మ్బాంగ్వా, ఫిర్దోస్ మూండా, మసూద్ పర్వేజ్, ఎమల్ పసర్లీ, జూలియా ప్రైస్, పాల్ రాడ్లీ, మెహ్లులి సిబాండా, గెర్ సిగ్గిన్స్, భరత్ సుందరేలేసన్ ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు