Ajinkya Rahane: ఆగలేకపోతున్నా.. సవాల్ కు సిద్ధంగా ఉన్నా: కేకేఆర్‌ కెప్టెన్‌ రహానె రియాక్షన్

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ బాధ్యతలు తనకు అప్పగించడంపై అజింక్య రహానె హ్యాపీగా ఫీలయ్యాడు. ‘‘కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉండటం నాకు గర్వకారణం. టైటిల్ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. ఆ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని కేకేఆర్ కెప్టెన్ తెలిపాడు.

New Update
Ajinkya Rahane excited to lead KKR in IPL 2025

Ajinkya Rahane excited to lead KKR in IPL 2025

ఐపీఎల్ 2025 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికోసం ఆయా జట్లు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగుతోంది. అయితే గత సీజన్ లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్న కేకేఆర్ ఈ ఏడాదిలో మాత్రం అతడిని రిటైన్ చేసుకోలేదు. గత మెగా వేలంలో శ్రేయస్ ను బదులుగా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానెను రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

రహానె రియాక్షన్

అంతేకాకుండా రహానెకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఇక తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై రహానె తాజాగా స్పందించాడు. ఈ మేరకు అతడు హ్యాపీగా ఫీలయ్యాడు. కేకేఆర్ కు సారథిగా ఉండటం తనకు గర్వకారణమని అన్నాడు. ఇప్పుడు తనముందు పెద్ద సవాల్ ఉందని తెలిపాడు. ముఖ్యంగా టైటిల్ ను నిలబెట్టుకోవడం సవాల్ తో కూడుకున్న పని అని చెప్పాడు. 

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

అయితే ఎలాంటి సవాల్ కి అయినా తాము సిద్ధంగా ఉన్నట్లు రహానె తెలిపాడు. గత సీజన్ లో టైటిల్ సాధించామని.. అయితే దాన్ని తానెప్పుడూ సాధారణ విషయంగానే చూస్తానని అన్నాడు. తమ ఆటగాళ్లతో తనకు బాగా కమ్యూనికేషన్ ఉందని తెలిపాడు. గ్రౌండ్ లో తమ భావాలను వ్యక్తపరచడానికి తమ ప్లేయర్లకు స్వేచ్చనిస్తానని.. అందరినీ అర్థం చేసుకుంటానని తెలిపాడు.

Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

ఐపీఎల్ 2025 సీజన్ లో మళ్లీ విజేతగా నిలిచేలా ఆడతాం అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో తమ టీం కచ్చితంగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తామని.. తనకు ఆ నమ్మకం ఉందని అన్నాడు. ఇంతటి గొప్ప అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు మేనేజ్ మెంట్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఇకపోతే ఈ ఐపీఎల్ 2025 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment