IPL 2024: హైదరాబాద్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్..జరుగుతుందా?

ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, లక్నో జెయింట్స్ మ్యాచ్ షెడ్యూల్ ఉంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉండడం...దానికి తోడు నిన్న పడిన భారీ వర్షానికి స్టేడియం అంతా నీటితో నిండిపోవడంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.

New Update
IPL 2024: హైదరాబాద్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్..జరుగుతుందా?

SRH Vs LSG IPL 2024: ఐపీఎల్ 2024లో ఇవాళ హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు రాత్రి ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) 7.30కు మ్యాచ్ మొదలవుతుంది. నిజానికి ఈ మ్యాచ్ రెండు జట్లకూ చాలా కీలకం. హైదరాబాద్, లక్నో రెండూ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఈ మ్యాచ్‌లో గెలిస్తే వాళ్ళకు అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు ఛాన్స్ తగ్గిపోతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలా అయినా గెలిచి తీరాలని ఇరు జట్లూ పట్టుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ మీద మేఘాలు కమ్ముకున్నాయి.

హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. నిన్న సాచయంత్రం నుంచి రాత్రి వరకు ఇక్కడ వర్షం భీభత్సంగా పడింది. దీని కారణంగా ఉప్పల్ స్టేడియం అంతా నీటితో నిండిపోయింది. గ్రౌండ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. కానీ నిన్న పడిన వర్షాన్ని కవర్లు ఆపలేకపోయాయి. దీంతో పిచ్ మొత్తం తడిపిసోయింది. గ్రౌండ్ నిండా వాటర్ ఉండి పోయింది. దానికి తోడు ఇవాళ కూడా హైదరాబాద్‌లో వర్షం పడొచ్చని చెబుతోంది వాతావరణ శాఖ. ప్రస్తుతానికి కాస్త ఎండ వచ్చినా సాయంత్రానికి ఆకాశం మేఘా వృతం అవుతుందని... వర్షం పడుతుందని ప్రెడిక్షన్స్ చెబుతున్నాయి. ఇప్పటికే గ్రైండ్‌ఓల ఉన్న నీళ్ళను ఎలా క్లియర్ చేయాలో తెలియడం లేదు. ఎంత క్లీన్ చేసినా మైదానం తడిగానే ఉండే అవకాశాలున్నాయి. దానికి తోడు వర్షం కూడా పడితే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేయాల్సిందే. అప్పుడు సన్ రైజర్స్ (Sun Risers Hyderabad), జెయింట్స్...రెండు జట్లకూ చెరో పాయింట్ సమానంగా పంచేస్తారు. దాంతో ఇరు జట్ల ఖాతాలలో 13 పాయింట్స్ ఉంటాయి. పట్టికలో చెన్నైని వెనక్కి నెట్టి 3, 4 స్థానాలకు చేరుకుంటాయి. అప్పుడు ప్లే ఆఫ్స్‌ రేసుమరింత క్లిష్టంగా మారుతుంది. లాస్ట్ మినిట్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్‌కు వెళతారో తెలియదు.


మరోవైపు మ్యాచ్ రద్దు అయితే టికెట్లు కొనుక్కున్న వారు, అభిమానులు కూడా భారీగా నిరాశ చెందుతారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ అద్భుతంగా ఆడి కనువిందు చేసింది. ఈ సారి కూడా అవే హోప్స్‌తో చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇవాళ మ్యాచ్‌ కానీ జరగకపోతే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశ చెందుతారు.

Also Read:IPL2024: ప్లే ఆఫ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్..బ్యాటింగ్ లో విరుచుకుపడిన ఢిల్లీ బ్యాటర్స్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment