Andhra Pradesh: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంతో పాటు వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయనున్నారు.

New Update
Andhra Pradesh: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

AP Government: అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలుకాలని అలాగే వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచనలు చేసింది. వీటికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వివరిస్తూ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ అంత్యక్రియలకు హాజరయ్యేలా ఆదేశాలిస్తామని మంత్రి సత్యకుమార్‌ ప్రకటించారు.

Also Read:  ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు!

అవయవ దానం చేసే భౌతిక కాయాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం కేంద్రం ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.10 వేల పారితోషికాన్ని మంజూరు చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అలాగే జీవదాతల కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ వారిని శాలువా, ప్రశంసాపత్రం, పుష్ఫగుచ్ఛాలతో సత్కరించాలని రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి భౌతిక శరీరం నుంచి అవయవాలను జిల్లా ఆసుపత్రి లేదా ప్రైవేటు ఆసుపత్రి ప్రధానాధికారి నుంచి తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్‌ బాధితుల కుటుంబ సభ్య మాచారాన్ని అందజేయాలని తెలిపారు. అనంతరం ఆ భౌతికకాయాన్ని సరైన సమయంలో గౌరవప్రదంగా అంతిమ సంస్కరణలు చేయాలని సూచించారు.

అయవవ దాతల కుటుంబాలకు ప్రశంసాపత్రాన్ని ఇచ్చి.. జ్ఞాపికను కూడా అందించాలని తెలిపారు. అవయవ సేకరణ తర్వాత ఆసుపత్రి నుంచి దాత నివాసం వరకు లేదా స్మశాన వాటిక వరకు భౌతికకాయాన్ని ఉచితంగా తరలించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆ తర్వాత అవయవ దాతకు సంబంధించిన ఫొటోతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో జిల్లా కలెక్టర్‌ పత్రికా ప్రకటన విడుదల చేయాలని సూచించారు.

Also Read: జగన్ కు మరో చిక్కు . .వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment