/rtv/media/media_files/2026/04/17/voting-on-three-bills-in-lok-sabha-soon-2026-04-17-16-14-06.jpg)
Voting on three bills in Lok Sabha soon
లోక్సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓటింగ్కు ముందు అధిరాక, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయిత్ ఈ ఓటింగ్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన కార్యాలయంలో సీనియర్ మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
Also Read: రిజర్వేషన్ బిల్లు మహిళల సాధికారత కోసం తెచ్చింది కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఎన్డీయే కూటమి సభ్యులందరూ సభకు హాజరయ్యేలా చూడటం, బిల్లులపై తలెత్తే అభ్యంతరాలను ఎలా ఎదుర్కోవాలో మీటింగ్లో దిశానిర్దేశం చేశారు. అయితే ఈ బిల్లులను విపక్ష ఇండియా కూటమి అడ్డుకునేందుకు యత్నిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాకం గాంధీ, కేసీ వేణుగోపాల్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై మాట్లాడారు. ఆ తర్వాత విపక్ష కూటమి నేతలందరూ కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు డీలిమిటేషన్ బిల్లును ఓడిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. చిన్న పార్టీలను కూడా తమవైపు తిప్పుకునేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read: రామలక్ష్మణులు వలస కూలీలు.. ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సభలో ఈ బిల్లులపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలంగించేందుకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా విపక్ష నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే దేశ రాజకీయ భవిష్యత్తుకు ఈ బిల్లులు కీలకమని కేంద్రం వాదిస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఈ చారిత్రక బిల్లులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా లోక్సభలో ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే 2/3 వంతు మెజార్టీ అవసరం. అంటే మొత్తం 540 ఎంపీలు ఉండగా 360 ఓట్లు కావాలి. ప్రస్తుతం NDAకు 293 ఎంపీల బలం ఉండగా.. విపక్ష పార్టీలకు 234 మంది ఎంపీల బలం ఉంది. ఈ బిల్లులు ఆమోదం పొందేందుకు కేంద్రానికి ఇంకా 67 ఓట్లు కావాలి. మరీ ఈ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందుతాయే? లేదో? తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే.
Follow Us