Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ రైలు పరుగులు, వీడియో వైరల్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా వందేభారత్‌ రైలు ఈ చీనాబ్ రైల్వే వంతెనపై పరుగులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Vande Bharat Train Passes Through The World’s Highest Chenab Rail Bridge

Vande Bharat Train Passes Through The World’s Highest Chenab Rail Bridge

Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై మరో అద్భుతమైన దృశ్యం కనిపించింది. తొలిసారిగా వందేభారత్‌ రైలు దీనిపై పరుగులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సెమీ హైస్పీ్డ్ వందేభారత్ రైలును శనివారం భారత రైల్వే ప్రారంభించింది. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్‌ వరకు ఈ రైలు పరుగులు పెట్టింది. 

Also Read: కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. నల్లమల్లారెడ్డి 200 ఎకరాల్లో!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన..

అయితే మార్గమధ్యంలో చీనా నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై ఈ వందేభారత్‌ రైలు ప్రయాణిస్తున్న రైలు దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. కశ్మీర్‌లో అతిచల్లని వాతావరణాన్ని తట్టుకునేలా ఈ వందేభారత్‌ రైలును ప్రత్యేకంగా తయారుచేశారు. అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఈ రైళ్లో ఏర్పాటు చేశారు.  

Also Read: పాకిస్థాన్ జైల్లో భారతీయ ఖైదీ మృతి.. శిక్షా కాలం పూర్తయినప్పటికీ.. !

ఉధంపుర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెను 2022లో నిర్మించిన సంగతి తెలిసిందే. నది గర్భం నుంచి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ రైల్వే బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. చైనాలో బెయిపాన్‌ నదిపై 275 మీటర్ల ఎత్తులో నిర్మించిన షుబాయ్ రైల్వే వంతెన ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా ఉండేది. అయితే చీనాబ్‌ నదిపై నిర్మించిన వంతెన ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే పారిస్‌లో ఉన్న ఐఫిల్ టవర్‌  ఎత్తు 312 మీటర్లు. దీంతో పోలిస్తే ఈ రైల్వే వంతెన ఎత్తు 47 మీటర్లు ఎక్కువగా ఉండటం మరో విశేషం.  

Also Read: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?

Also Read: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్‌ అతలాకుతలం.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment