UPI Payments: ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ చేయలేరు!

దేశంలో యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినపడుతుంది. లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే @, #, $ వంటివి ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు అవ్వనుంది.

New Update
UPI

గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌ లో  యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు. ఈ యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినపడుతుంది.

Also Read: Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

ఏదైనా యూపీఐ యాప్ లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే @, #, $ వంటివి ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు చేయడం జరుగుతుంది.భారతదేశంలో లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించే అనేక యాప్‌లు ఉన్నాయి. అయితే, Paytm, Phonepe వంటి సాధారణంగా ఉపయోగించే యాప్‌లు లావాదేవీ ఐడీలలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించడం లేదు.

Also Read: DeepSeek: ప్లే స్టోర్ లో డీప్‌ సీక్‌ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!

అక్షరాలను మాత్రమే...

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని యూపీఐ యాప్‌లను లావాదేవీ ఐడీలో ఆల్ఫాన్యూమరిక్  అక్షరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్‌లు ఈ నియమాన్ని పాటించకపోతే ఫిబ్రవరి 1, 2025 తర్వాత వాటి లావాదేవీలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. NPCI 9 జనవరి 2025న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అన్ని UPI యాప్‌లు ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్ల @, #, $ వంటివి ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఏదైనా యూపీఐ యాప్ ఈ నియమాన్ని పాటించకపోతే ఆ యాప్ నుండి యూపీఐ లావాదేవీలు పనిచేయవు. ఈ నియమం వ్యాపార వినియోగదారులకు వర్తిస్తుంది. కానీ ఇది సాధారణ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ నియమాన్ని పాటించని ఏదైనా యాప్‌తో UPIని ఉపయోగిస్తే, మీ పేమెంట్స్ రద్దు చేయడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ ఐడీని 35 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌గా మార్చగలిగేలా ఈ మార్పు చేయడానికి NPCI ఇప్పటికే అన్ని యూపీఐ యాప్‌లకు సమయం ఇచ్చింది. 

దీంతో పాటు ఫేక్ ట్రాన్సాక్షన్ ఐడీలను నివారించాలని యాప్‌లకు కూడా సూచించింది. ఈ మార్పు వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. లావాదేవీలను ట్రాక్ చేయడం సులభం అవుతుంది.. అంతేకాకుండా కస్టమర్ల భద్రత కూడా పెరుగుతుంది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది..మీదేనేమో చూసుకోండి మరి!

Also Read: Maha Kumbh Mela 2025: 27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త .. చివరకి ట్విస్ట్ ఏంటంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. భార్య వేధింపులకు మరో భర్త బలి

ఒడిశాకు చెందిన ఓ భర్త భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలిపాడు. భార్య వేధింపులు భరించలేక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Odisha crime

Odisha crime Photograph: (Odisha crime)

భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల బెంగళూర్‌లో అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఒడిశాకు చెందిన మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో ద్వారా తెలిపాడు. ఒడిశాలోని ఖుర్దాలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

భార్య పెట్టే మానసిక వేధింపులు భరించలేక..

ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తి వీడియో తీశాడు. నేను రామచంద్ర బర్జెనా కుంభర్‌బస్తాలో ఉంటున్నాను. నా భర్య పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో తెలిపాడు. అయితే వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. తన భార్య కొన్ని రోజుల నుంచి రామచంద్రను మానసికంగా వేధిస్తోంది. దీనివల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

విడాకులు కూడా ఇస్తానని బెదిరిస్తోంది. ఇన్నీ భరించలేక రామచంద్ర ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపాడు. దీంతో రామచంద్ర తల్లిదండ్రులు కోడలిపై ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108, 351(2), 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

భార్య రూపాలి భర్త, అత్త మామల మాట కూడా వినేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు కన్నవారింటికి వెళ్లేదని అత్తమామలు ఆరోపించారు. కనీసం వారి మాటకు గౌరవం లేకుండా వ్యవహరించేదని, రామచంద్ర తల్లిదండ్రులు తెలిపారు.

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

Advertisment
Advertisment
Advertisment