Wifes: ఏం స్కెచ్ వేశారమ్మా.. బ్యాంకులకు టోపీ పెట్టేందుకు కట్టుకున్న మొగుళ్లను!

బ్యాంకులో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు.

New Update
up womens bank

బ్యాంకులో తీసుకున్న  రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. సదరు మహిళలపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406, 419, 467, 368, 471 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.  

Also Read :  ఫేస్ మసాజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి?

గ్రూప్-లెండింగ్ స్కీమ్ కింద

ఇండస్ఇండ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ అందించిన గ్రూప్-లెండింగ్ స్కీమ్ కింద ఈ మహిళలు గతంలో రుణాలు తీసుకున్నారు.  ఈ రుణ పథకం గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒకవేళ లబ్ధిదారురాలి భర్త మరణిస్తే, మిగిలిన రుణ వాయిదాలను మాఫీ చేస్తుంది. అయితే దీని అలుసుగా తీసుకున్న ఓ నలుగురు మహిళలు బ్యా్ంకుకే టోపీ పెట్టాలని అనుకున్నారు. ప్లాన్ లో భాగంగా..  ఈ నలుగురు మహిళలు తమ భర్తలు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టి్ంచి రుణాలను ఎగ్గొట్టాలని అనుకున్నారు. 

Also Read :  నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త.. 50 వేల మందికి ఫ్రీ ట్రైనింగ్!

అయితే బ్యాంకు అధికారుల దర్యాప్తులో ఆ మహిళల భర్తలు బతికి ఉన్నట్లుగా తేలింది.  దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ దేవేష్ కుమార్ శర్మ వెల్లడించారు. 

Also read :  Sonu Sood wife : సోనూసూద్ భార్య సోనాలీకి యాక్సిడెంట్... తీవ్రగాయాలు!

Also Read:  హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!

 

police | women | uttar-pradesh | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | bank-loans

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్‌థౌఖోంగ్‌, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు.

New Update
terrorist arrest

terrorist arrest Photograph: (terrorist arrest)

భద్రతా దళాలు మణిపూర్‌లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో నిషేధిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అలాగే వారు వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌థౌఖోంగ్‌లో ఆదివారం ఓ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యున్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ధృవీకరించారు. తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ సభ్యుడిని అరెస్టు చేశాయి.

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

బిష్ణుపూర్ జిల్లాలోని లైషోయ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన సోదాల్లో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక SLR రైఫిల్‌తో కూడిన మ్యాగజైన్, ఒక కార్బైన్ మెషిన్ గన్, ఒక .303 రైఫిల్, ఒక డబుల్ బ్యారెల్ గన్, 48 రౌండ్ల మందుగుండు సామగ్రి, 2 గ్రెనేడ్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర వస్తువులు ఉన్నాయి. శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు భారీగా గన్స్ గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, బిష్ణుపూర్, తౌబాల్ మరియు తూర్పు ఇంఫాల్ సహా వివిధ జిల్లాల నుండి 2 నిషేధిత సంస్థలు- యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)లకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.

Advertisment
Advertisment
Advertisment