Toll Plaza: గడిచిన ఐదేళ్లలో భారీగా టోల్‌ ట్యాక్స్ వసూలు..

దేశంలో జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల నుంచి కేంద్రానికి భారీగా ట్యాక్స్‌ వచ్చింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.1.93 లక్షల కోట్లు వసూలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను లోక్‌సభలో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

New Update
Toll Plaza

Toll Plaza

దేశంలో జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల నుంచి కేంద్రానికి భారీగా ట్యాక్స్‌ వచ్చింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.1.93 లక్షల కోట్లు వసూలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను లోక్‌సభలో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే.. దేశంలో అత్యధిక టోల్ ట్యాక్స్‌ను గుజరాత్‌లో NH-48లో ఉన్న వడోదరభరూచ్ సెక్షన్‌లోని టోల్‌ ప్లాజా వసూలు చేసింది. 2019 నుంచి 2024 వరకు రూ.2,043.81 కోట్ల టోల్‌ను వసూలు చేసింది. 

టోల్ ఆదాయ జాబితాలో రెండోస్థానంలో రాజస్థాన్‌ నిలిచింది. గత ఏదేళ్లలో షాజహాన్‌పూర్‌ టోల్‌ ప్లాజాలో రూ.1,884.46 కోట్ల విలువైన టోల్‌ వసూలు అయినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్‌ ప్లాజా నిలిచింది. 2019 నుంచి 2024 వరకు ఇక్కడి నుంచి రూ.1,538.91 కోట్లు వసూలయ్యాయి. యూపీలోని బారజోధ టోల్‌ ప్లాజా గత ఏదేళ్లలో రూ.1,480.75 కోట్లు వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 

Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యంగంపై నడ్డా సంచలన కామెంట్స్!

టాప్ 10 ఆదాయాన్నిచ్చే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్‌లోనే ఉన్నాయి. మరో రెండు రాజస్థాన్‌లో, రెండు యూపీలో ఉన్నాయి. ఇక హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఏదేళ్లలో ఈ టాప్ 10 టోల్‌ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్‌ను వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 1,603 టోల్‌ ప్లాజాలున్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలు గత ఐదేళ్లలోనే ఏర్పాటు చేశారు. 

 టాప్ 10 ఆదాయాన్ని ఆర్జించే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్‌లో, రెండు రాజస్థాన్‌లో రెండు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే 10 టోల్ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్ వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు. మొత్తానికి గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని టోల్‌ ప్లాజాల నుంచి రూ.1.93 లక్షల కోట్లు వసూలయ్యాయి. 

Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి!

 rtv-news | toll-plaza | tax 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment