New Born Baby: బిడ్డ గొంతు కోసి చెత్తబుట్టలో వేసిన తల్లి.. చివరికీ

ఓ తల్లి తన పసిబిడ్డ గొంత కోసి చెత్త బుట్టలో పడేసింది. అయినప్పటికీ ఆ చిన్నారి బతికి బయటపడింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ఆ తల్లి ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
New born baby

New born baby

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లోని భోపాల్‌లో దారుణం జరిగింది. ఓ తల్లి తన పసిబిడ్డ గొంత కోసం చెత్త బుట్టలో పడేసింది. అయినప్పటికీ ఆ చిన్నారి బతికి బయటపడింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ఆ తల్లి ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ మహిళా బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మహిళా తన తల్లితో కలిసి ఆ పాప గొంతు పిసికింది. దీంతో ఆ చిన్నారి స్పృహ తప్పిపోయింది. 

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

Bhopal New Born Baby Crime

ఆ పాప చనిపోయిందనుకుని వాళ్లు ఓ చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికీ చిన్నారి ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. దాదాపు నెల రోజుల పాటు కొందరు వైద్యులు ఆ చిన్నారికి పలు శస్త్రచికిత్సలు చేసి బతికించారు. పాప గొంత పిసికినా కూడా.. కీలకమైన ధమనులు, సిరలు తెగిపోలేవు. అందువల్లే పాపను రక్షించామని, ఇన్ని శస్త్రచికిత్సలు తట్టుకొని కూడా పాప బతకడం అద్భుతమని వైద్యులు తెలిపారు. ఆ పాపను ముద్దుగా పిహు అని పిలుచుకుంటున్నట్లు చెప్పారు.  

Also Read: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!

అయితే ఆ పాపను బాలల సంక్షేమ కమిటీ పర్మిషన్‌తో రాజ్‌గఢ్‌లోని ఓ సంక్షేమ కేంద్రానికి తరలించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చిన్నారిని అక్కడ అప్పగించిన తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పనిపాపపై ఈ దారుణానికి పాల్పడ్డ ఆ చిన్నారి తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ

Also Read :  వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతురను హతమార్చిన తండ్రి

బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఆగ్రహించిన తండ్రి ఆమెను ఇంటికి రప్పించి హత్య చేశాడు. చివరికి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

New Update
Bihar Man Kills Daughter

Bihar Man Kills Daughter

బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తండ్రి ఆమెను హత్య చేయడం కలకలం రేపింది. మృతదేహన్ని బాత్‌రూమ్‌లో ఉంచి  లాక్‌ చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాక్షి (25) అనే అమ్మాయి తన ప్రియుడితో కలిసి మార్చి 4న ఢిల్లీకి పారిపోయింది. మాజీ సైనికుడైన తండ్రి ముఖేష్ సింగ్ వారం తర్వాత తన కూతురుకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత సమస్తిపూర్‌కు ఆమెను రప్పించాడు.   

Also Read: భారత్‌కు చేరుకున్న తహవ్వుర్ రాణా.. ఉరిశిక్ష విధిస్తారా ?

కానీ వేరే కులానికి చెందిన వ్యక్తితో కూతురు వెళ్లిపోవడంతో తండ్రి ముఖేష్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి ఏప్రిల్ 7న తన కూతురును హత్య చేశాడు. ఇంట్లో బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని ఉంచి లాక్ చేశాడు. అనంతరం ఆమె ప్రియుడిని కూడా హత్య చేసేందుకు వెళ్లాడు. కానీ అతడు గ్రామంలో లేకపోవడంతో వెనక్కి వచ్చేశాడు. అయితే కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లి భర్తను ముఖేష్‌ను అడిగింది. దీనికి అతడు సాక్షి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. 

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

దీంతో కూతురు కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటికి వచ్చి పరిశీలించారు. లాక్‌చేసిన బాత్‌రూమ్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. డోర్‌ తీయగా లోపల మృతదేహం కనిపించడంతో షాక్ అయిపోయారు. దీంతో తండ్రి ముఖేష్‌ను అదుపులోకి తీసుకొని అడిగారు. వేరే కులం వ్యక్తితో పారిపోవడంతో తానే హత్య చేసినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. చివరికీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

rtv-news | murder

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు