/rtv/media/media_files/2026/04/21/kerala-2026-04-21-17-15-06.jpg)
Three killed in blast at fireworks unit in Kerala's Thrissur
కేరళలోని త్రిస్సూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Just days ahead of the famous #Thrissur Pooram festival a major explosion was reported at a fireworks storage facility. At least 3 people have been reported dead, with fears of more casualties or injuries as rescue operations continue. #Keralapic.twitter.com/WPCBg2tmlQ
— Ashish (@KP_Aashish) April 21, 2026
Also Read: ప్రధాని మోదీ 'ఉగ్రవాది'.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ఇదిలాఉండగా ఇటీవలే తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో కూడా ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ విషాద ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ బాణసంచా కేంద్రం ధ్వంసమైపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఆదివారం రోజుల కార్మికులు టపాసుల తయారుచేస్తుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. ముడి పదార్థాలు కలుపుతుండగా రాపిడికి గురవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Follow Us