Wedding: పెళ్లిచేస్తాం, గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్

కొందరు వ్యక్తులు సామూహిక వివాహాలు చేస్తామని నమ్మించి, డబ్బులు తీసుకొని పలు జంటలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన జంటలు పోలీసులను ఆశ్రయించాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Wedding

Wedding

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలే కాదు.. వేరే మార్గాల్లో కూడా జనాలను మోసం చేస్తున్నాయి కొన్ని ముఠాలు. తాజాగా సామూహిక వివాహాలు చేస్తామని నమ్మించి పలు జంటలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దగ్గరుండి పెళ్లి చేసి కానుకలు కూడా ఇస్తామని, సామూహిక వివాహాలు ఏర్పాట్లు చేస్తామని, కట్నం కూడా ఇస్తామంటూ ఆశపెట్టారు. చివరికి ఎన్నో ఆశలతో వేదిక వద్ద వచ్చిన జంటలు తాము మోసపోయామని తెలుసుకోని కంగుతిన్నారు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది.    

Also Read: కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు.. పార్టీపై శశిథరూర్‌ తీవ్ర అసంతప్తి!

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని రాజ్‌కోట్, చుట్టుపక్కల ప్రాంతల్లో ఉండే ప్రజలకు.. కొందరు వ్యక్తులు సామూహిక పెళ్లిళ్లు జరిపించే నిర్వాహకులమని చెబుతూ నమ్మించారు. దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు చేస్తామని.. కానుకలు కూడా ఇస్తామని మభ్యపెట్టారు. వాళ్ల మాటలు నమ్మిన 28 జంటలు వివాహానికి సిద్ధమయ్యాయి. చెప్పిన తేదీకి వారు వేదిక వద్దకు వెళ్లారు. కానీ అక్కడ ఏం ఏర్పా్ట్లు కనిపించలేదు. దీంతో ఆ నిర్వాహకులకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ వచ్చింది. చివరికి వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్‌ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్‌!

ఆ నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల దాకా వసూలు చేసినట్లు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత వాళ్లకి వివాహాలు జరిపించే బాధ్యత పోలీసులు తీసుకున్నారు. కొన్ని జంటలు ఆలయాలు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి వివాహం చేసుకున్నాయి. ఆరు జంటలకు పోలీసులే దగ్గరుండి పెళ్లి చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్‌ కమిషనర్‌ రాధికా భరాయ్‌ తెలిపారు. 

Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!

Also Read: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment