/rtv/media/media_files/2025/02/27/G1POCgR0JxY36brJkYLi.jpg)
olice announce Rs 1 lakh reward for those giving info on accused
మహారాష్ట్రలోని పూణేలో ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంలో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు దత్తాత్రయ రామ్దాస్ గాడే కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడిని ఎవరైనా పట్టిస్తే వాళ్లకి రూ.లక్ష నగదు అందిస్తామని ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మాస్క్ వేసుకొని తప్పించుకు తిరుగుతున్నాడని.. అతడిని పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: కోమాలో భారతీయ విద్యార్థిని.. తండ్రి అత్యవసర ప్రయాణం కోసం కేంద్రం సాయం!
ఇక వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని ఔంధ్ బనేర్ ప్రాంతంలో ఉండే 26 ఏళ్ల మహిళ ఓ ఆస్పత్రిలో కౌన్సెలర్గా విధులు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25న ఉదయం 6 గంటల సమయంలో స్వర్గేట్ బస్టాండ్కు వచ్చింది. అయితే ఆమె వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు మరో ప్లాట్ఫామ్ వద్ద ఉందని చెప్పాడు. ఇది నమ్మిన మహిళ అతడి వెంట వెళ్లింది. ఎవరూ లేని చీకటి ప్రదేశంలో పార్కు చేసిన బస్సు వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. ప్రయాణికులు ఎవరూ లేరని ఆమె అడగ్గా బస్సు లోపల కూర్చున్నారని అతడు చెప్పాడు. ఆమె బస్సులోకి వెళ్లగానే అతడు కూడా ఎక్కి డోర్ లాక్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులకు చెప్పేందుకు బయపడింది. చివరికీ ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.
#WATCH | #Pune: 26-Year-Old Woman Rap*d Inside Shiv Shahi Bus At Swargate Bus Stand; City Police Seals Bus Door
— Free Press Journal (@fpjindia) February 26, 2025
Read the story by @AnkitShukla5454 on The Free Press Journal: https://t.co/UG2qAPfdoM#punenews #maharashtra #swargate pic.twitter.com/ju0uvPTN9S
ఆమె సాయంతో స్వర్గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని దత్తాత్రామ్ రామ్దాస్ గడేగా గుర్తించారు. అంతేకాదు శిక్రపూర్, శిరూర్ పోలీస్ స్టేషన్లలో అతడిపై దొంగతనం కేసులున్నట్లు కూడా చెప్పారు. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా పూణే పోలీసులకు ఆదేశించారు.
Also Read: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్