/rtv/media/media_files/2026/05/03/pinarayi-vijayan-2026-05-03-19-03-24.jpg)
Pinarayi Vijayan
మరికొన్ని గంటల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పినరయ్ విజయన్ సోషల్ మీడియాలో తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన తన సోషల్ మీడియా బయోలో మార్పులు చేశారు. బయోలో.. పొలిట్ బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అని మార్చారు. సీఎం పేరును తీసివేయడంతో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.
కేరళ ఎన్నికల్లో మెజార్టీ సర్వేలు ఈసారి UDF కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి LDF కూటమి ఓడిపోతుందనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బయో మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేరళ పేరు అంశం కూడా చర్చనీయాంశమవుతోంది. మలయాళీ ప్రజల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
Also Read: రేపే ఎన్నికల ఫలితాలు.. 5 రాష్ట్రాల్లో హై అలెర్ట్
అయితే కేరళ పేరు మార్పు కోసం ఇప్పటికే రాష్ట్ర, కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఇప్పుడు ఈ అంశం పార్లమెంటరీ ప్రక్రియలో ఉంది. త్వరలోనే అధికారికంగా పేరు మార్పు అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Follow Us