/rtv/media/media_files/2025/04/01/3jbKD1FSUUFneIRoA8Md.jpg)
India-pakistan Border
పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన బారత ఆర్మీ వారిని విజయవంతంగా అడ్డుకుంది. ఈ క్రమంలో మన ఆర్మీకి, పాక్ సైన్యానికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం సీజ్ ఫైర్ ఉల్లంఘించి కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ధీటుగా బదులిచ్చింది.
Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!
5 గురు పాక్ సైన్యం మృతి?
కొంతసేపు పాటూ భారత ఆర్మీ, పాక్ సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం ఆపకుండా బులెట్ల వర్షం కురిపించింది. దానికి తగ్గట్టుగానే ఇండియన్ ఆర్మీ కూడా జవాబు చెప్పింది. ఈ కాల్పుల్లో నలుగురు, ఐదుగురు చొరబాటుదారులు మరణించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అఫీషియల్ గా దీనిని ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. ఈ ఘటన తర్వాత కృష్ణ ఘాటి ప్రాంతంలో భారత సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
today-latest-news-in-telugu | india | pakistan | border | army
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్