Heavy Smog: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం..

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. మరోవైపు వయనాడ్ నుంచి ఢిల్లీకి వచ్చాక గ్యాస్ ఛాంబర్‌లోకి ప్రవేశించినట్లు ఉందని ప్రియాంక గాంధీ అన్నారు.

New Update
glu


దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. అక్కడ దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా రెండో రోజు కూడా వాయునాణ్యత సూచి 400 దాటింది. దీంతో సమీపంలోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. పొగమంచు ఎఫెక్ట్‌ విమానాలపై కూడా పడింది. దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఈ మేరకు ఫ్లైట్‌రాడర్ 24 సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, అక్కడి నుంచి బయలుదేరాల్సిన 226 సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది. 

Also Read: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ?

మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై మంత్రి గోపాల్‌రాయ్ స్పందించారు. '' ఈ సీజన్‌లో తొలిసారి రెండు రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా ఉంది. అక్టోబర్ 14 నుంచి 400 కన్నా తక్కువగా ఉన్న ఈ సూచి ఒక్కసారిగా ఎలా పెరిగింది అనే దానిపై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. పర్వతాల వద్ద మంచు కురుస్తుండటం వల్ల ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. అందుకే ప్రస్తుతం నార్త్ ఇండియాలో పొడి వాతావరణం ఉంది. రేపటినుంచి కాలుష్య స్థాయిలు తగ్గే ఛాన్స్ ఉంది. 

Also Read :  ఆ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. షాకింగ్ విషయం బయటపెట్టిన 'విశ్వం' హీరోయిన్

 ఆ ప్లాన్ అమలు చేయట్లే

ఈ అంచనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ''గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(Grap)-3ని అమలు చేయడం లేదు. ఈ ప్లాన్ అమల్లోకి వస్తే అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. అయిదవ తరగతి లోపు విద్యార్థులకు పాఠశాలలో సెలవులు ఉంటాయని'' మంత్రి అన్నారు. 

Also Read: మహారాష్ట్ర ఎన్నికలు.. స్కూటర్‌లో పట్టబడ్డ రూ.1.5 కోట్లు

గ్యాస్‌ ఛాంబర్‌లోకి వచ్చినట్లుంది

ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. కేరళలోని ఢిల్లీకి తిరిగివచ్చాక.. ఇక్కడ గ్యాస్ ఛాంబర్‌లోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీలో ఎప్పటికప్పుడు కాలుష్యం పెరుగుతూనే ఉందని.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలతో బాధడుతున్నవారికి ఇది కష్టమైన పరిస్థితని తెలిపారు. రాష్ట్రంలో పరిశుభ్రమైన గాలి కోసం అందరూ కలిసి పార్టీలను దాటి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

Also Read :  నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.

New Update
Exercise Aakraman

పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్‌లో రాఫెల్ యుద్ధ వివానాలు పాల్గొన్నాయి. పంజాబ్‌లోని అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లను మోహరించింది. ఇందులో లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడుల వంటి వాటిని నిర్వహించాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లు తెలుస్తోంది. 

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

రఫెల్ ఫైజర్ జెట్లు సరిహద్దు ప్రాంతాలకు చాలా దగ్గరగా ప్రయాణించాయని తెలుస్తోంది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ (AWACS) అమర్చిన విమానాలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచాయి. అదే సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లు కూడా సరిహద్దు దాటి ఎగురుతూ కనిపించాయి. 

( loc | indian-air-force | Exercise Aakraman | attack in Pahalgam | Pahalgam attack | pakistan | india | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment