రాజ్యాంగంపై ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న జంట.. ఎక్కడంటే ?

ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ పెళ్లి జరిగింది. తరతరాలు వస్తున్న ఆచారాలు, సంప్రదయాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఓ జంట వివాహం చేసుకున్నారు. అలాగే అంబేద్కర్‌ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Couple Oath on Constitution

Couple Oath on Constitution

ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ పెళ్లి జరిగింది. తరతరాలు వస్తున్న ఆచారాలు, సంప్రదయాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఓ జంట వివాహం చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, అమ్మాయి మెడలో తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి ఆచారను కూడా వాళ్లు పాటించలేదు. కేవలం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దండలు మార్చుకున్నారు. అలాగే అంబేద్కర్‌ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. 

Also Read: అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్‌.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు

సాధారణంగా పెళ్లికి అందరూ ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ ఈ జంట మాత్రం ఎలాంటి అనవసర ఖర్చులు కూడా చేయకుండానే సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇలా పెళ్లి చేసుకోవడంపై పెళ్లి కొడుకు ఇమాన్ లాహ్రె కూడా స్పందించారు. వివాహ కార్యక్రమానికి పెట్టే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలా చేసినట్లు తెలిపారు. తమకు ఆచారాలు, సంప్రదాయల కన్నా రాజ్యాంగం మీదే ఎక్కువగా నమ్మకం ఉందని పేర్కొన్నారు. 

Also Read: ఈ శాంటా క్లాస్ అసలైంది కాదా.. ఆయన పుర్రె ఆధారంగా డిజైన్ చేశారా!

డిసెంబర్ 18న ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లా కాపు గ్రామంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అందరిలా కాకుండా ఇలా కొత్తగా, రాజ్యాంగంపై ప్రమాణం చేసి సింపుల్‌గా పెళ్లి చేసుకోవడంపై..ఈ జంట బంధువులు, గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి పెళ్లి చేసుకున్న ఆ జంట ఆలోచనా విధానాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.ఎక్కువ ఖర్చు చేయకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నందుకు ప్రశంసిస్తున్నారు. 

Also Read: శ్రీతేజ్ ఇప్పట్లో కోలుకోడు.. నాకే భయమేసింది: కోమటిరెడ్డి ఎమోషనల్!

Also Read: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది


 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

ఉగ్రవాదులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్‌ చేసినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు కాగా.. ఒకరు స్థానిక ఉగ్రవాదని చెప్పాయి.

New Update
Pahalgam Terrorist Attack

Pahalgam Terrorist Attack

పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఉగ్రదాడికి సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పర్యాటకులను చంపేందుకు ఉగ్రవాదులు పెద్ద ప్లానే వేశారు. టెర్రరిస్టులు పహల్గాంలోని బైసరన్‌ను చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్‌ చేసినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

తమ ప్లాన్‌ను అమలుచేసేందుకు ఉగ్రవాదులు కోకెర్నాగ్‌ అడవుల నుంచి బైసరన్‌ లోయ వరకు నడుచుకుంటూ వచ్చారని తెలిసింది. 25 మందికి పైగా పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు పాల్పడ్డారు.దాడులు చేస్తున్న సమయంలో ఓ స్థానికుడు, పర్యాటకుడి నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు కూడా లాక్కున్నట్లు సమాచారం.   

ఈ ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీళ్లలో ముగ్గురు విదేశీయులు, మరొకరు స్థానిక ఉగ్రవాదిగా గుర్తించారు. స్థానిక ఉగ్రవది ఆదిల్ థోకర్‌గా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదిల్‌ స్వస్థలం అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బెహారాకు దగ్గర్లో గురీ అని చిన్న గ్రామం. అతడు టీనేజ్‌లో ఉన్నప్పుడే పలు నిషేదిత ఉగ్ర సంస్థలకు చెందిన వాళ్ల దగ్గర పనిచేశాడు. 2018లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాడు. ఆ ఏడాదే పాకిస్థాన్ నుంచి స్టూడెంట్ సాధించి వాఘా సరిహద్దు దాటాడు.   

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

పాకిస్థాన్‌కు వెళ్లిన అతడు ఉగ్రవాదిగా తిరిగొచ్చి సొంతగడ్డపైనే కిరాతకానికి పాల్పడ్డాడు. ఇదిలాఉండగా ఇప్పటికే ఈ ఉగ్రదాడిపై భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్‌ పోలీసుల బృందాలు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ బృందాలు పహల్గాంలో దర్యా్ప్తు ప్రారంభించాయి.     

 telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment