Weddings: తగ్గుతున్న పెళ్లిళ్లు.. పెరుగుతున్న విడాకులు

2024లో చైనాలో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
 marriages in China crash to record low, while divorces on the rise

marriages in China crash to record low, while divorces on the rise

ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. చేసుకున్న వారిలో కూడా ఒకరు లేదా ఇద్దరి కన్నా ఎక్కువమంది పిల్లలను కనేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో ఆయా దేశాల్లో జనాభా సంక్షోభం పెరిగిపోతోంది.  ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా.. గత కొన్నేళ్లుగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య భారీగా తగ్గిపోతున్నట్లు గణాంకాలు వెల్లడవుతున్నాయి. 

Also Read: పాపం.. డాన్స్ చేస్తుండగానే ఎలా జరిగిందో చూడండి.. యువతి వీడియో వైరల్!

2024లో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. జనాభాను పెంచేందుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా అక్కడ యువత వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. 1986లో చైనా వివాహాల రిజిస్ట్రేషన్ మొదలుపెట్టింది. అయితే అప్పటినుంచి ఇంత స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2013లో 1.3 కోట్ల వివాహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పుడు చాలావరకు తగ్గిపోవడంతో చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.  

Also Read: అమెరికా బాటలో యూకే.. 600 మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్టు

ఇదిలాఉండగా 2024లో 26 లక్షల జంటలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. 2023తో పోలిస్తే 28 వేలు అధికంగా నమోదైనట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే విడాకుల సంఖ్యను తగ్గించేందుకు చైనా సర్కార్ గతంలోనే ఓ నిర్ణయం తీసుకుంది. విడాకుల కోసం అప్లికేషన్ పెట్టుకునే జంటలకు 30 రోజుల కూలింగ్ ఆఫ్‌ వ్యవధిని తప్పనిసరి చేసింది. 2021నుంచే దీన్ని అమలు చేస్తున్నా కూడా ఈ సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్‌థౌఖోంగ్‌, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు.

New Update
terrorist arrest

terrorist arrest Photograph: (terrorist arrest)

భద్రతా దళాలు మణిపూర్‌లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో నిషేధిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అలాగే వారు వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌థౌఖోంగ్‌లో ఆదివారం ఓ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యున్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ధృవీకరించారు. తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ సభ్యుడిని అరెస్టు చేశాయి.

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

బిష్ణుపూర్ జిల్లాలోని లైషోయ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన సోదాల్లో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక SLR రైఫిల్‌తో కూడిన మ్యాగజైన్, ఒక కార్బైన్ మెషిన్ గన్, ఒక .303 రైఫిల్, ఒక డబుల్ బ్యారెల్ గన్, 48 రౌండ్ల మందుగుండు సామగ్రి, 2 గ్రెనేడ్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర వస్తువులు ఉన్నాయి. శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు భారీగా గన్స్ గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, బిష్ణుపూర్, తౌబాల్ మరియు తూర్పు ఇంఫాల్ సహా వివిధ జిల్లాల నుండి 2 నిషేధిత సంస్థలు- యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)లకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు