నెల జీతం రూ.13వేలే.. కానీ గర్ల్‌ఫ్రండ్‌కు ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్

ముంబాయికి చెందిన ఓ యువకుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఫేక్ మెయిల్ ద్వారా సంస్థకు తెలియకుండా రూ.21.6 కోట్లు కాజేశాడు. ఆ డబ్బుతో కార్లు, బైక్‌ కొనడంతో పాటు తన ప్రేయసికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.

New Update
Computer Operator

Computer Operator Photograph: (Computer Operator)

చేసేది కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం.. నెలకు జీతం రూ.13 వేలు.. కానీ ప్రియురాలికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చాడు. ముంబాయిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ నుంచి తెలియకుండా రూ.21.6 కోట్లు కొట్టేశాడు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, బైక్‌లు, ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 

ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!

ఫేక్ మెయిల్ ఐడీతో..

వివరాల్లోకి వెళ్తే ముంబాయిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా హర్షల్ కుమార్ క్షీరసాగర్ పనిచేస్తున్నాడు. ఓ నకిలీ మెయిల్ ఐడీని క్రియేట్ చేసి జులై నుంచి ఇప్పటి వరకు రూ.21.6 కోట్లు నగదు వివిధ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నాడు. బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ చేసి ఉన్న మెయిల్ అడ్రస్‌కు ఒకేలా ఉండే మెయిల్‌ను క్రియేట్ చేశాడు. కేవలం ఒక్క అక్షరం మాత్రమే మార్చాడు. ఆ తర్వాత మెయిల్‌ అడ్రస్‌లో పొరపాటు ఉందని.. అప్‌డేట్‌ చేయాలని కోరుతూ బ్యాంక్‌కు లేఖ రాశాడు. 

ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దీంతో ఆ మెయిల్ ఐడీకి లావాదేవీలు అన్ని అయ్యేలా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి డబ్బును కాజేశాడు. రూ.1.2 కోట్లతో బీఎండబ్ల్యూ కారు, రూ.1.3 కోట్లతో ఎస్‌యూవీ, రూ.32 లక్షలతో బీఎండబ్ల్యూ బైక్ కొని, తన ప్రియురాలికి ఛత్రపతి శంభాజీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గరలో 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంకా ఆమె కోసం వజ్రాల కళ్లజోడును కూడా ఆర్డర్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు హర్షల్ కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment