High Court: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మైనర్ బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని ముంబై హైకోర్టు చెప్పింది. 2019లో 14 ఏళ్ల బాలికపై 24ఏళ్ల యువకుడు లైంగిక దాడి చేయగా పొక్సో కేసులో 5ఏళ్లు జైల్లో ఉన్నాడు. శనివారం అతనికి బెయిల్ మంజూర్ చేస్తూ జస్టిస్‌ మిళింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
high court 2  bombay

Mumbai High Court sensational comments in minor girl rape case

High Court: మైనర్ బాలికల శృంగారంపై ముంబై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియుడితో ఇష్టంగా రతిలో పాల్గొనడం తప్పు కాదని చెప్పింది. 2019లో ఓ వ్యక్తిపై పొక్సో చట్టం కింద నమోదైన కేసు విచారణలో న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన 24 ఏళ్ల యువకుడికి ముంబై హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. బాధితురాలు మైనర్‌ అయినప్పటికీ పరస్పరం ఇష్టంతో గడిపినపుడు నిందితుడికి బెయిల్‌ ఇవ్వొచ్చని న్యాయమూర్తి జస్టిస్‌ మిళింద్‌ స్పష్టం చేశారు. 

అతనితో మూడు రోజులు గడిపిన బాలిక..

ఈ మేరకు 2019లో కేసు నమోదైనపుడు బాధిత బాలిక వయసు 14 ఏళ్లు. ఆ యువకుడికి 19 ఏళ్లు. అయితే వీరిద్దరు ప్రేమలో పడగా మూడు రోజులు ఆ బాలిక అతనితో గడిపింది. ఈ క్రమంలో ఆమె పేరెంట్స్ యువకుడిపై లైంగిక దాడి కేసు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు. ఈ కేసు విచారణ శనివారం జరగగా.. మైనర్ బాలికే అయినా అన్నీ తెలిసి చేసినపుడు నేరంగా పరిగణించలేమని హైకోర్టు అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Bird flu: ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. 95 గ్రామాల్లో పిట్టల్లా రాలిపోతున్న నాటు కోళ్లు!

ఇదిలా ఉంటే.. 2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో పదేళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగానే కేసు అంతా నడిచింది. అందులో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో బాధితురాలు తాను అంతకు ముందు చెప్పిన వాటిల్లో తరువాత తానే కొన్నింటిని తిరస్కరించింది. దీంతో  సాక్షి సాక్ష్యంతో కొంత భాగం ప్రాసిక్యూషన్ కేసుతో సరిపోలినప్పటికీ, నేరాన్ని నిర్ణయించడంలో సాక్షి మొత్తం విశ్వసనీయత చాలా కీలకమని జస్టిస్ సనప్ హైలెట్ చేశారు. లోపభూయిష్ట దర్యాప్తులు లేదా బలవంతపు సాక్ష్యాల ఆధారంగా తప్పుడు శిక్షలు పడకుండా కోర్టులు నిర్ధారించుకోవాలని సూచించారు. అందుకే ఎనిమిది మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని కోర్టు ప్రకటించింది. 

ఇది కూడా చదవండి: Maha Shivratri 2025: లింగోద్భవ కాలం అంటే ఏంటీ.? అర్థరాత్రి అన్ని శివాలయాల్లో పూజలు ఎందుకు?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment