ముంబయి కోర్టు సంచలన తీర్పు.. 8 మంది పాకిస్థానీయులకు 20 ఏళ్ల జైలుశిక్ష..

ముంబయి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రూ.7 కోట్ల విలువైన 232 కిలోల డ్రగ్స్ కేసులో 8 మంది పాకిస్థాన్ జాతీయులకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది.

New Update
Court

Court

ముంబయి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎనిమిది మంది పాకిస్థాన్ జాతీయులకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది. 2015లో రూ.7 కోట్ల విలువైన 232 కిలోల డ్రగ్స్ కేసులో 8 మందిని దోషులగా నిర్ధారించిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2015లో గుజరాత్‌ తీరంలో హెరాయిన్‌ తరిస్తున్న ఓ బోటును భారత కోస్టుగార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బోటులో 11 డ్రమ్ములు, గోధుమ వర్ణంలోని పొడితో ఉన్న 20 ప్లాస్టిక్‌ పౌచ్‌లు గుర్తించారు. ఆ ప్యాకెట్లలో ఉన్న పదార్థాన్ని పరిశీలించగా అది హెరాయిన్ అని తేలింది. దీంతో కోస్ట్‌గార్డ్ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అలాగే మూడు శాటిలైట్‌ ఫొన్‌లు జీపీఎస్‌ నావిగేషన్ చార్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు.   

Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆ తర్వాత కోస్ట్‌గార్డు అధికారులు నిందితులను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ కేసులో నిందితులకు గరిష్ఠంగా శిక్ష విధించాలని.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమేశ్ పుంజ్వానీ కోర్టును అభ్యర్థించారు. అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక కావాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. ఎనిమిది మంది దోషులకు శిక్ష ఖరారు చేసింది.

Also Read: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

Also Read: ఈ ఏడాది సంస్కరణల సంవత్సరం.. రక్షణశాఖ కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment