Maha Kumbh Mela: మహా కుంభమేళా రికార్డు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళా శక్తిని ప్రపంచమంతా కీర్తిస్తోందని కొనియాడారు.

New Update
Maha Kumbh Mela

Maha Kumbh Mela

Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj, Uttar Pradesh)లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది మంది భక్తులు అక్కడికి పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) కీలక విషయాలు వెల్లడించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా శక్తిని ప్రపంచమంతా కీర్తిస్తోందని కొనియాడారు. 

Also Read: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన

మన రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధిపై నమ్మకం లేనివాళ్లు కుంభమేళాపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారంటూ విమర్శలు చేశారు. వాస్తవానికి మహాశివరాత్రి లోపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నామని.. కానీ అంతకన్నా ముందే తమ అంచనాలకు మించి భక్తులు కుంభమేళాకు వచ్చారని పేర్కొన్నారు. 144 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకు ఇది కొనసాగనుంది. తొలుత 40 నుంచి 45 కోట్ల మంది ఇక్కడికి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ కుంభమేళా క్రేజ్‌ ప్రపంచం నలుమూలలకు వెళ్లిపోయింది. దీంతో నిత్యం దాదాపు కోటిన్నర మంది ఇక్కడికి వస్తున్నారు. 

Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!

ఏకంగా 8 కోట్ల మంది...

అయితే జనవరి 29న మౌని అమవాస్యం సందర్భంగా ఏకంగా 8 కోట్ల మంది వచ్చినట్లు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఈ కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఇటీవల ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

Also Read: దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్!

Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్‌ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment