మెటా CEO మార్క్ జుకర్ బర్గ్‌కు పార్లమెంటరీ నోటీసులు..!

కరోనాని సరిగా నిర్వహించలేదని భారత్‌తో సహా అనేక దేశాలు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఓ పోర్డ్‌కాస్ట్‌లో అన్నాడు. ఈ వ్యాఖ్యలపై జుకర్ బర్గ్ ఇండియా పార్లమెంట్, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

New Update
jukar berg

jukar berg Photograph: (jukar berg)

లోక్ సభ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నిషికాంత్ దూబే మెటా సంస్థ సీఈఓ మార్క్‌తో పార్లమెంట్, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఇటీవల మెటా సీఈవో మార్క్‌జూకర్‌ బర్గ్‌ ఓ పోడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని అన్నారు. 

Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. జూకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని గుర్తుచేశారు. ఇదే విషయంలో జుకర్ బర్గ్‌కు ఇండియన్ పార్లమెంట్‌ నోటీసులు పంపింది. అవాస్తవాలు చెప్పినందుకు మెటా సీఈఓ భారత పార్లమెంట్‌కు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ ప్యానల్ సమన్లు పంపింది. జో రోగన్ నిర్వహించిన ఓ పోడ్‌కాస్ట్ షోలో జుకర్ బర్గ్ ఈ వివాదాస్పద వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

Also Read: USA: మస్క్ చేతికి టిక్‌టాక్‌...అమ్మే ఆలోచనలో చైనా

ప్రపంచంలో ఎన్నికల పోకడల గురించి చర్చించారు. ఆ సందర్భంలోనే కోవిడ్ 19ని సరిగా నిర్వహించనందుకే ప్రపంచంలో భారత్‌తో సహా అన్నీ దేశాల్లో ఆ టైంలో అధికారంలో ఉన్న పార్టీలకు అధికారం ఎన్నికలప్పుడు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ మాటలను బీజేపీ నాయకులు తప్పుబట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!

పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్‌ హనీమూన్‌కి స్విట్జర్లాండ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ వెళ్లగా ఈ దాడి జరిగింది. వీసా రిజక్ట్ కాకపోయి ఉంటే వినయ్ చనిపోయే వాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన భారీ ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. 28 మంది పర్యాటకులు ఈ ఉగ్రదాడిలో మృతి చెందారు. వీరిలో హర్యానికి చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) అనే నేవీ అధికారి కూడా ఉన్నాడు. వీరికి పెళ్లయిన ఆరు రోజులకు మరణించారు. భర్త మృతిని తట్టుకోలేక ఆ నవవధువు బాధ వర్ణణాతీతం. అయితే కొచ్చిలో విధులు నిర్వర్తిస్తున్న వినయ్‌కు ఏప్రిల్ 16న వివాహం జరిగింది.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని..

తనకు స్విట్జర్లాండ్ అంటే ఇష్టం. ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ అయినా పహల్గాం వెళ్లారని వినయ్ భార్య, తాత చెబుతున్నారు. స్విటర్లాండ్ వీసా క్యాన్సిల్ కావడమే ఇలా జరిగిందని, ఇలా కాకపోయి ఉంటే వినయ్ బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు