Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

ఛత్తీస్‌గఢ్ కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం  చేసింది.

New Update
Maoists

Maoists

Maoist Letter on Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ(Maoist Sensational Letter) విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో(Encounter) మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. మరణించిన 8 మందిలో నలుగురు గ్రామస్తులున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సమత, మావోయిస్టు డివిజన్ కమిటీ గంగ పేరుతో పోలీసులు నకిలీ ప్రెస్ నోట్ విడుదల చేశారని అధికారిక లేఖలో పేర్కొంది. 

Maoists sensational letter
Maoists sensational letter

 

Maoists letter
Maoists letter

 

8 వేల మంది పోలీస్ బలగాలు..

ఈ మేరకు శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సమత ప్రవక్త పేరుతో లేఖ విడుదల చేసింది. పోలీస్ శాఖ మావోయిస్టు పార్టీ పేరుతో ప్రకటనలు చేసి ప్రజల్లో సందేహాలు, నిరాశలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడింది. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర ఇంచార్జ్ కామ్రేడ్ దామోదర్ క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ పరిధిలోని సింగవరం, తుండేపల్లి, మల్లెంపేట పూజారి కాంకేర్ గ్రామాలపై 8 వేల మంది పోలీస్ బలగాలు దాడి చేసినట్లు తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరుతో యుద్ధం చేపట్టిన ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందన్నారు. 

ఇది కూడా చదవండి: Hydra: కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. నల్లమల్లారెడ్డి 200 ఎకరాల్లో!

ఇదిలా ఉంటే..  మావోయిజం అంతం చేయాలనుకోవడం నీటిపై రాతలేనని పౌరహక్కుల సంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ అన్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన మావోయిస్టు చలపతి అంత్యక్రియలు నిర్వాహణ సందర్భంగా RTVతో మాట్లాడిన చంద్రశేఖర్.. ఈ నేలపై నక్సలిజం ఎన్నటికీ చావదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలాగే ఈ ఎన్ కౌంటర్లపై ప్రొఫెసర్ హరగోపాల్, పౌర హక్కుల నేత, అడ్వకేట్ లక్ష్మణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మానవ మారణహోమాన్ని సమాజం క్షమిందని అన్నారు. 

ఇది కూడా చదవండి: Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ నటి.. బాధలో ఫ్యాన్స్

ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దులో జనవరి 19న మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్(Chhattisgarh-Orissa Encounter) జరిగింది. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఛత్తీస్ గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడు చంద్రహాస్ అలియాస్ పాండు, చలపతి మరణించినట్లు పోలీసులు ఆధారాలతో సహా వెల్లడించారు. దీంతో అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ఇరువురి గ్రామాలకు మావోయిస్టు సానూభూతి పరులు తరలివెళ్లారు. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి యాప్రాల్‌కు చెందిన చంద్రహాస్ నివాసం వద్దకు మావోయిస్టు సానుభూతి పరులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అంత్యక్రియల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ ఆర్టీవీతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?

ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్‌ అతలాకుతలం.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేశారని స్పష్టం చేసింది.

New Update
Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. అమ్మాయిని బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకొచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేసినట్లు చెప్పారు. 

Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారని.. కొందరు విద్యార్థినులు సరదాగా ఈ పని చేసినట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. తోటి స్నేహితులు ఒక అమ్మాయిని సూట్‌కేసులో కూర్చోబెట్టి క్యాంపస్‌లో గ్రౌండ్‌కి, మేడ మీదకి తీసుకెళ్లారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లని గమనించి ఆపారు. సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి వచ్చింది. ఈ వీడియో బయటకు వెళ్లడంతో దీన్ని తప్పుగా చిత్రీకరించారు. ఇలా చేసిన విద్యార్థులకు వర్సిటీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసిందని'' తెలిపారు.

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఇదిలాఉండగా.. జిందాల్ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సూట్‌కేసులో ఓ అమ్మాయిని కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అక్కడున్న సిబ్బంది ఆ సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. దీంతో తాజాగా దీనిపై స్పందించిన వర్సిటీ యాజమాన్యం ఇదంతా ప్రాంక్ అని స్పష్టం చేసింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

 telugu-news | rtv-news | haryana | national-news 

 

 

Advertisment
Advertisment
Advertisment