Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!

మావోయిజం అంతం చేయాలనుకోవడం నీటిపై రాతలేనని పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ అన్నారు. చలపతి, చంద్రహాస్‌ను చంపినంత మాత్రానా ఈ నేలపై నక్సలిజం చావదన్నారు. తలలకు వెలకట్టి, తూట్లు పోడవడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు.  

New Update
maoist

Civil rights leader chandrashekar Sensational comments

Maoist: మావోయిజం అంతం చేయాలనుకోవడం నీటిపై రాతలేనని పౌరహక్కుల సంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ అన్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన మావోయిస్టు చలపతి అంత్యక్రియలు నిర్వాహణ సందర్భంగా RTVతో మాట్లాడిన చంద్రశేఖర్.. ఈ నేలపై నక్సలిజం ఎన్నటికీ చావదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలాగే ఈ ఎన్ కౌంటర్లపై ప్రొఫెసర్ హరగోపాల్, పౌర హక్కుల నేత, అడ్వకేట్ లక్ష్మణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మానవ మారణహోమాన్ని సమాజం క్షమిందని అన్నారు. 

Also Read :  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

భారీగా తరలివెళ్లిన సానూభూతి పరులు..

ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దులో జనవరి 19న మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఛత్తీస్ గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడు చంద్రహాస్ అలియాస్ పాండు, చలపతి మరణించినట్లు పోలీసులు ఆధారాలతో సహా వెల్లడించారు. దీంతో అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ఇరువురి గ్రామాలకు మావోయిస్టు సానూభూతి పరులు తరలివెళ్లారు. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి యాప్రాల్‌కు చెందిన చంద్రహాస్ నివాసం వద్దకు మావోయిస్టు సానుభూతి పరులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అంత్యక్రియల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ ఆర్టీవీతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. 

Also Read :  నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

ఎదురుకాల్పులని అబద్ధాలు.. 

'తలలకు వెల కట్టి చంపుతారా? ఎదురుకాల్పులని అబద్ధాలు చెబుతున్న పోలీసులు మావోయిస్టులను బంధించి తూటాలతో తూట్లు పొడుస్తున్నారు. చలపతిని చంపినంత మాత్రానా నక్సలిజం చావదు. ఆయన అంతిమ యాత్రకు ఆప్యాయులే అండగా ఉన్నారు. బొడ్డాపాడుకు చలపతికి వున్న అనుబంధం వెలకట్టలేనిది' అన్నారు. ఇక మావోయిస్టు చలపతి మావయ్య లక్ష్మణరావు మాట్లాడుతూ.. 'నా అల్లుడు అంత్యక్రియలకు వారే వారసులు. పేరుకే ఎన్ కౌంటర్. అంతకు ముందు చిత్రహింసలు పెట్టారు. మృత దేహాల ఆనవాల్లను గుర్తించే పరిస్థితి లేదు. నా కూతురు అరుణ చలపతి భార్య అన్న విషయం నాకు తెలియదు. నా అల్లుడుని చిత్రహింసలు పెట్టి ఎన్ కౌంటర్ చేసారు' అని ఆరోపించారు.

Also Read :  Fake cigarettes: ఏపీలో నకిలీ సిగరేట్ల కలకలం..10టన్నుల చైనీస్ గార్లిక్, 2 టన్నుల గంజాయి!

ఇదిలా ఉంటే.. శుక్రవారం మావోయిస్ట్ ఛత్తీస్‌గఢ్ ఏరియా కమిటీ మెంబర్ కొవ్వాసి సోమడ అలియాస్ ముకేశ్‌ ను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కల్లేరు అటవీ ప్రాంతంలో ముకేశ్‌ పట్టుబడ్డాడు. అతని నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Also Read : Ananya Panday: ఒళ్ళంతా మల్లెపూలు చుట్టుకున్న అనన్య.. ఇలా చూస్తే మీ పని అంతే ఇక!

Advertisment
Advertisment
Advertisment