Accident: ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నదియా జిల్లాలో వేగంగా వచ్చిన ఓ కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ACCIDENT

ACCIDENT

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నదియా జిల్లాలో వేగంగా వచ్చిన ఓ కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Also Read: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు!

అయితే ఈ రిక్షా డ్రైవర్లు ఈద్‌ వేళ షాపింగ్ చేసి ఇంటికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. '' రోడ్డుపై వేగంగా వస్తున్న ఎస్‌యూవీ వరుసగా మూడు ఈ రిక్షాలు ఢీకొంది. ఇందులో ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది గాయాలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని'' పోలీసులు వివరించారు.

Also read: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు!

అలాగే ప్రమాదం జరిగిన అనంతరం ఘటన స్థలంలోనే డ్రైవర్ కారు వదిలేసి పారిపోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్‌ ..లక్షలాది కొబ్బరికాయలతో...

Also Read: అమ్మాయి వలపు వలలో పడి.. పాకిస్థాన్‌కు మిలటరీ సీక్రేట్స్‌ లీక్‌

Advertisment
Advertisment
Advertisment