/rtv/media/media_files/2025/02/28/sCuiM4HqZD3SlUS6jgyb.jpg)
KumbhMela women open bath videos on porn sites
Kumbhamela: కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన మహిళా భక్తులకు కేటుగాళ్లు ఊహించని షాక్ ఇస్తున్నారు. స్నానాలు చేస్తుంటే రహస్యంగా వీడియోలు తీసి పోర్న్ సైట్లకు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది.
యూపీకి భారీ ఆదాయం..
ఈ మేరకు ఈ సంవత్సరం 65 కోట్లకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా 26న చివరి అమృత్ స్నానాలతో ముగిసింది. ఈ కార్యక్రమం కోసం రూ.2700 కోట్లు ఖర్చు చేస్తే రూ.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపారమే జరిగింది. లోకల్గా ఉండే చిన్న వ్యాపారులకు కూడా మంచి ఆదాయం వచ్చింది. అయితే పనిలో పనిగా అక్కడికి వెళ్ళిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లూ మోనాలిసా అనే పూసలమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేశారు. నాగాసాధువులు, మహిమలూ, ఐఐటీబాబాలు ఇట్లా చాలామందిని వెలుగులోకి తెచ్చారు.
నీచమైన పనికి ఒడిగట్టారు..
ఇదంతా ఒకవైపైతే మరోవైపు అక్కడికి చేరిన ఇంకో బ్యాచ్ మాత్రం మరో పనిలో పడింది. లక్షలమందిలో ఎవరు ఏం చేస్తున్నారో గమనించటం కష్టం. అంత పెద్ద గుంపుల్లో పోలీసులైనా ప్రతీ మనిషినీ గమనించటం సాధ్యం కాదు అందులోనూ మీడియా కెమెరాలు, టూరిస్టుల కెమెరాలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లూ అంటూ వేలమంది తిరుగుతుంటే నిఘావిభాగం చూసీ చూడనట్టు వదిలేసింది. దీంతో స్మార్ట్ ఫోన్లతో తిరిగేవాళ్లు ఇదే పాయింట్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు అక్కడ నీచమైన పనికి ఒడిగట్టారు. దేవున్ని తలుచుకుంటూ వెళ్ళినవాళ్లలో ఎంతోమంది తమకు తెలియకుండానే పోర్న్సైట్లలో, సోషల్ మీడియా వెకిలి పేజీల్లో కనిపించారు. ఆడపిల్లలు, మహిళలూ స్నానాలు చేస్తుంటే వీడియోలు తీశారు. వాటిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బులకి అమ్ముకుంటున్నారు.
దీనివెనుక ఒక రాకెట్ ఉంది..
అయితే ఈ విషయాన్ని కుంభమేళాకోసమే స్పెషల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ బయటపెట్టింది. కుంభమేళాలో జరిగే ఘటనలమీద ఫేక్ న్యూస్లు ప్రచారం చేయటం, కుంభమేళా మీద దుష్ప్రచారం చేయటం లాంటి ప్రచారాలు జరగకుండా చూడటం ఈ టీమ్ పని. ఈ క్రమంలోనే ఫేక్ న్యూస్ కోసం సెర్స్ చేస్తున్న క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫార్మ్స్ లో కొన్ని వీడియోలు కనిపించాయి. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి ఎవరెవరు అప్లోడ్ చేస్తున్నారు, వీళ్లు ఎక్కడినుంచి ఇలాంటి వీడియోలు సంపాదించారు అని విచారణ చేస్తే దీనివెనుక ఒక రాకెట్టే ఉందని అర్థమైంది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
కొన్ని గ్యాంగ్స్ ఇదే పని మీద ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఫిబ్రవరి 17 న కటోలీ కుంభమేళా పోలీస్స్టేషన్లో మొదటి కేసు నమోదైంది. ఆ ఎకౌంట్ ఓనర్ ఎవరూ, ఎక్కడినుంచి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడూ లాంటి వివరాలకోసం మెటాని సంప్రదించారు. ఆ వివరాలు చేరకముందే ఫిబ్రవరి 19న మరో విషయం తెలిసింది. అదేమిటంటే.. టెలిగ్రామ్యాప్లో ఈ వీడియోలని సేల్కి పెట్టి మరీ అమ్ముతున్నారని. కానీ మెటా యాప్స్లో దొరికినంత ఈజీగా టెలిగ్రామ్ యాప్లో చానల్ క్రియేటర్స్ వివరాలు పట్టుకోవటం కష్టంగా మారినట్లు తెలిపారు. అక్కడ సానం చేసిన అమ్మాయిల, మహిళల వీడియోలని మార్ఫ్ చేసి మరీ మరింత అశ్లీలంగా మార్చి అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 12 నుంచీ 18 మధ్యలో ఓపెన్ బాతింగ్ వీడియోస్ గురించి టెలిగ్రామ్లో మిలియన్ల సెర్చ్లు జరిగాయట. దీంతో ఒకవేళ మీ పట్ల అలాంటి కంటెంట్ ఏదైనా మీ దృష్టికి వచ్చినా సైబర్ సెల్లో ఓ కంప్లైంట్ ఇవ్వండి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని వీడియోలను తొలగిస్తామని పోలీసులు సూచించారు.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!