Viral News: కోడిపుంజుపై కేసు.. ఆర్డీవో విచారణ: చివరికి ఏమైందంటే!

కేరళ పథనంథిట్టలో ఓ కోడి కేసు చర్చనీయాంశమైంది. పల్లికల్‌లో అనిల్ ఇంటిపై పెంచుకుంటున్న కోడిపుంజులు ఉదయం 3 గంటలకే కూతలు పెట్టడంతో నిద్రకు భంగం కలుగుతుందంటూ పక్కింటి రాధాకృష్ణ ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో ఆధ్వర్యంలో విచారణ చేపట్టి షెడ్ మార్పించారు. 

New Update
cock case

Kerala cock case

Viral News: కేరళలో ఓ ఆసక్తికర కేసు చర్చనీయాంశమైంది. కోడి కూత కారణంగా నిద్రకు భంగం కలుగుతుందంటూ ఓ వృద్ధుడు కోడిపుంజు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు(Kerala Cock Case). తెల్లవారుజామున 3 గంటలకే ప్రతిరోజు నరకం కనిపిస్తుందని, నిద్రలేమి వల్ల తన హెల్త్ పాడైపోతుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేపట్టిన అధికారులు కీలక ఆదేశాలు జారీ చేయగా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

3 గంటలకు టార్చర్ మొదలు..

కేరళలోని పథనంథిట్ట జిల్లా పల్లికల్‌ గ్రామానికి చెందిన రాధాకృష్ణ, అనిల్‌కుమార్‌ అనే వ్యక్తుల ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే అనిల్ ఇంట్లో కోడిపుంజులను పెంచుకుంటున్నాడు. అవి ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు జోరుగా కూతలేస్తున్నాయి. ఒకటి తర్వాత మరొకటి తెల్లావారేసరికి వందసార్లకు పైగా కూతపెడుతున్నాయి. దీంతో విసిగెత్తిపోయిన రాధాకృష్ణ అడూర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చదవండి: Fire Accident: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు

ఆర్డీవో బృందం విచారణ.. 

ప్రతిరోజు కోడికూతలవల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. వెంటనే నాకు ఉపశమనం కల్పించండి అంటూ రాధాకృష్ణ అధికారులను వేడుకున్నాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్డీవో బృందం.. అనిల్, రాధాకృష్ణ ఇళ్లను పరిశీలించింది. అనిల్‌ తన ఇంటిపై కోడిపుంజులను పెంచుతున్నట్లు నిర్ధారించుకుని యాక్షన్ మొదలుపెట్టారు. అనిల్ పౌల్ట్రీ షెడ్డును ఖాళీ ప్రాతంగా ఉన్న సౌత్ ఫేస్ దిక్కుకు మార్చాలని తెలిపారు. ఇందుకుగానూ అతనికి 14 రోజుల టైమ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా జనాలు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 

ఇది కూడా చదవండి: క్షమించండి.. ఇకపై అలాంటి సినిమాలు చేయను.. విశ్వక్ సేన్ సంచలన ప్రకటన!

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Newborn trafficked :  అలా చేస్తే ఆస్పత్రుల లైసెన్స్ రద్దు.. సుప్రీంకోర్టు కీలక వార్నింగ్!

నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశంలో ఏ ఆసుపత్రిలోనైన చిన్నారుల అక్రమ రవాణా జరగినట్లు నిరూపితమైతే వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించింది.

New Update
supreme

Newborn trafficked : నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరగినట్లు నిరూపితమైతే,వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా నేరాలను అడ్డుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో ఒక నవజాత శిశువు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ విషయాన్ని గుర్తించిన శిశువు తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటికే ఆ చిన్నారిని ఓవ్యక్తి అక్రమంగా విక్రయించినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Also Read: Mamya Shajaffar: ట్రెడిషనల్ లుక్‌లో మమ్యా షజాఫర్.. ఎల్లో డ్రెస్‌లో లక్ష్మీదేవిలా కనిపిస్తుందిగా!

అనంతరం అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారించింది. చిన్నారుల అక్రమరవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరు, నిందితుడికి బెయిల్ మంజూరుచేసిన అలహాబాద్‌ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ రవాణా పెండింగ్‌ కేసులకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని దేశవ్యాప్తంగా హైకోర్టులను జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిందితుడి బెయిల్ రద్దు చేసింది. ‘‘ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలి. రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలి’’ అని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!

ఏ ఆస్పత్రిలోనైనా అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్‌ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘కుమారుడిని పొందేందుకు ఆశపడిన నిందితుడు.. రూ.4 లక్షలకు చిన్నారిని పొందాడు. ఒకవేళ బిడ్డ కావాలని అనుకుంటే అక్రమ రవాణా చేసేవారిని సంప్రదించాల్సింది కాదు. ఆ చిన్నారిని దొంగతనం చేసి తనకు అందించారనే విషయం నిందితుడికి బాగా తెలుసు. ఇలాంటివారు సమాజానికి ముప్పు. నిందితులు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో తప్పకుండా హాజరుకావాలి. కానీ, దీనిపై దృష్టిసారించకుండా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Also Read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు నాణేలు.. ఇలా బుక్ చేసుకోండి!

''తనకు కుమారుడు కావాలని ఆశపడ్డ నిందితుడు, రూ.4 లక్షలిచ్చి ఓ చిన్నారిని కొనుగోలు చేశాడు. బిడ్డ కావాలనుకుంటే, చట్టబద్ధ మార్గంలో దత్తత తీసుకోవాలి కానీ అక్రమ రవాణాదారులను సంప్రదించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ చిన్నారి దొంగతనమై తనకు ఇచ్చారని నిందితుడికి స్పష్టంగా తెలిసే పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం. వీరు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిందే. అయితే ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకునే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు'' అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Also Read: Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్

Advertisment
Advertisment
Advertisment