Kareena Kapoor : రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా పాత ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నానని వెల్లడించింది. అతని ఫోటోలను తరుచూ చూస్తుండేదానని తెలిపింది.  ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

New Update
rahul kareena

ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తన నటనతోనే కాకుండా వ్యక్తిగత జీవితం పరంగా కూడా వార్తల్లో నిలిచింది. సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా పాత ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

Also Read :  Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో!

ఇంతకు అదేంటంటే..  కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నానని వెల్లడించింది. అతని ఫోటోలను తరుచూ చూస్తుండేదానని తెలిపింది. తాను సినిమా కుటుంబం నుండి వచ్చానని రాహుల్ల రాజకీయ నాయకుడి కుటుంబం నుండి వచ్చారు కాబట్టి బహుశా ఇది కాంట్రవర్సీకి దారి తీయవచ్చునని ఆమె అభిప్రాయపడింది. కరీనా వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో  ఆ సమయంలో రాహుల్ గాంధీ చాలా అందంగా ఉండేవారంటూ.. మీరు చెప్పిన దాంట్లో తప్పు లేదని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :  Group-1: గ్రూప్‌-1 పేపర్లు రీవాల్యుయేషన్‌ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్

షాహిద్ కపూర్‌తో డేటింగ్

కాగా కరీనా గతంలో చాలా ఏళ్లు నటుడు షాహిద్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఆమె తషాన్ సినిమా సెట్స్‌లో పరిచయమైన సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి తైమూర్ , జెహ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక రాహుల్ గాంధీ ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదు. 

Also Read :  IPL 2025లో ముంబై చెత్త రికార్డు.. ఐపీఎల్ లోనే ఏ జట్టుకూ లేని!

Also read :  GV Prakash: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ట్విస్ట్ ఏంటంటే!

 

kareena-kapoor | Kareena Kapoor news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-sports-news | national news in Telugu | rahul-gandhi

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment