మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్‌లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్‌లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది.

author-image
By Manogna alamuru
New Update
11

Jarkhand Voting: 

జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్ 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా 38 స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ జేఎంఎం–ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో అవినీతి, ప్రజాకర్షక హామీలు, కేంద్ర నిధుల విడుదల లాంటిఅంశాలు కీలకంగా నిలిచాయి. గత ప్రభుత్వంలోని సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అవడం...దాంతో సీఎం మారడం..మళ్ళీ ఆయన జైలునుంచి తిరగి వచ్చి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం ఇలా బోలెడు ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ సారి జార్ఖండ్ ఎన్నికలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో అంటే నవంబర్ 23న విడుదల చేయనున్నారు.  

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్..

జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు.. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు.ఈనెల 13న జరిగిన తొలి విడతలో కూడా భారీగానే ఓటింగ్ నమోదైంది. అప్పుడు కూడా 70 శాతం దాకా ఓటింగ్ నమోదైంది. 

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

మహారాష్ట్ర..

మరోవైపు ఈరోజు మహారాష్ట్రలో కూడా పోలింగ్ ముగిసింది. ఇక్కడ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఇక్కడ కూడా దాదాపు 60 శాతం ఓటింగ్ నమోదైంది. మామూలుగా అయితే ఇక్కడ ఇంకా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కానీ మహారాష్ట్రలో ఈరోజు పోలింగ్‌ కాస్త నెమ్మదిగా మొదలయింది. ప్రజలు కాస్త లేట్‌గా ఆవడంతో ముగిసే సమయానికి 60 మాత్రమే నమోదయిందని అధికారులు చెప్పారు. 

ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్!

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత పోలింగ్ జరిగింది. మహాయుతి, మహా అఘాడీ మధ్య ఇక్కడ తీవ్ర పోరు ఉంది.  9.7 కోట్ల మంది ఓటర్లు  ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటర్ల కోసం లక్షా 186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మహాయుతిలో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా..  శివసేన 81 స్థానాల్లో, ఎన్సీపీ 59 చోట్ల పోటీ చేసింది.  అలాగే కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. శివసేన ( ఉద్ధవ్) 95, ఎన్సీపీ(ఎస్‌పీ) 86 చోట్ల పోటీ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి చిన్న పార్టీలు తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

Also Read: ఎగ్జిట్‌ పోల్స్‌.. ఝార్ఖండ్‌లో ఆ పార్టీదే అధికారం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment