Indian Railways: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?

భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి.

New Update
Indian Railways

Indian Railways

భారతీయ రైల్వేలో నిత్యం కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. అందుకే దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు తెచ్చుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. దూరపు ప్రయాణాల కోసం చాలామంది రైల్వే ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?

పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి. ముఖ్యంగా గూడ్స్ రైళ్లతో భారీగా ఆదాయం వస్తోంది. మొత్తంగా భారతీయ రైల్వే నెలసరి ఆదాయం రూ.12 వేల కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే వేల సంఖ్యలో సరకు రవాణా రైళ్లను నడుపుతున్నాయి. లక్షల టన్నుల వస్తువులను ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్తున్నాయి. గూడ్స్ రైళ్లతో పాటు ప్యాసింజర్‌ రైళ్లు సైతం భారీగా ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. అంతేకాదు రైల్వేలు జారీ చేసే స్క్రాప్ టెండర్ల నుంచి కూడా రైల్వేలు భారీగా ఆదాయన్ని తెచ్చిపెడుతున్నాయి.    

Also Read: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ

 ఇదిలాఉండగా.. భారతీయ రైల్వేల వల్ల లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇందులో రైల్వే ఉద్యోగులతో సహా తయారీ రంగం, ప్లాట్‌ఫామ్‌లు, రైల్వే స్టేషన్‌లలలో వ్యాపారాలు, మరికొందరు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

Also Read: మెట్రో ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్ ... ఛార్జీలు పెంపు..?

Also Read: మరో మయన్మార్‌ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!

indian-railways | telugu-news | rtv-news | trains | national-news

 

   
   

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda scam: MP, MLAల స్పెషల్‌ కోర్టులో ముడా స్కామ్‌పై ED పిటిషన్

ముడా స్కామ్‌లో లోకయుక్తా పోలీసులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని ఈడీ MP, MLAల స్పెషల్‌ కోర్టులో సవాలు చేసింది. ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో 8 పేజీల పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ త్వరలోనే కోర్టు విచారించనుంది.

New Update
muda scam case

muda scam case Photograph: (muda scam case)

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ ఎదురైంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల స్కామ్‌లో దర్యాప్తు చేసిన లోకాయుక్త పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లోకాయుక్తా పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను రద్దు చేయాలని ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల కోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఈడీ 8 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. లోకాయుక్త నివేదికలో ఆయన నిర్దోషి అని తప్పుగా పేర్కొన్నారని వాదిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది ED. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఇతరులపై పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

Also read: Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు

ED పిటిషన్‌ను ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తోంది. లోకాయుక్త నివేదికను అంగీకరించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కర్ణాటక హైకోర్టు గతంలో ED సమన్లను రద్దు చేసింది. కానీ ఇప్పుడు దర్యాప్తు కోసం ఒత్తిడి మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. 2021లో మైసూరులోని విజయనగర ప్రాంతంలో 14 ప్లాట్లను ముడా సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా, కేసరే గ్రామంలో పార్వతి యాజమాన్యంలోని 3.16 ఎకరాల భూమిని ముడా స్వాధీనం చేసుకుందనే ఆరోపణపై ED దర్యాప్తు చేస్తోంది. ఈ కేసునే ముడా స్కామ్‌గా కొనసాగుతుంది. ఈడీ విచారణలో సిద్ధరామయ్య తప్పు చేశారని వెల్లడైంది.  కానీ 2025 ఫిబ్రవరిలో లోకయుక్త పోలీసులు ఆయన కుటుంబం నిర్థోషి అని క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ విషయంపై ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల స్పెషల్ కోర్టుకు వెళ్లింది.

Also read : Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment