/rtv/media/media_files/2024/10/24/zdspyFBmfbMyqGE2p5PR.jpg)
జమ్మూకశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్ మోడ్ టన్నెల్ ను నిర్మించారు . సోన్మార్గ్ దారి అంతా కొండలు, మంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ ఎప్పుడూ కొండచరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారుతున్నాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ 12 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. ఇది సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. ఇది శ్రీనగర్- సోన్మార్గ్ల మధ్య ప్రయాణాన్నికూడా సులభతరం చేస్తుంది. ఈ టన్నెల్ ఇప్పుడు పూర్తయింది. దీన్ని ప్రారంభించడానికే ఇప్పుడు ప్రధాని మోదీ జమ్మూ–కాశ్మీర్ వెళ్ళనున్నారు. ఈ నెల 13 న ఆయన దీన్ని ప్రారంభించనున్నారు.
I am eagerly awaiting my visit to Sonmarg, Jammu and Kashmir for the tunnel inauguration. You rightly point out the benefits for tourism and the local economy.
— Narendra Modi (@narendramodi) January 11, 2025
Also, loved the aerial pictures and videos! https://t.co/JCBT8Ei175
Also read: వారానికి 90 గంటల పని వివాదం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
టన్నెల్ ఫోటోలు, వీడియోలు..
ఈ టన్నెల్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్లో షేర్ చేశారు. సోన్మార్గ్ టన్నెల్ పర్యటకులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శ్రీనగర్ నుంచి కార్గిల్/ లేహ్కు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది అంటూ అందులో రాశారు. దీనికి ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. టన్నెల్ను ప్రారంభించడానికి తానెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని చెప్పారు.
Visited Sonmarg today to review preparations for PM @narendramodi ji’s visit on Monday. The inauguration of the Z-morh tunnel will open Sonmarg to tourism all year round, Sonmarg will now be developed as a great ski resort. The local population will not have to leave in winter &… pic.twitter.com/NxQtG7pkWP
— Omar Abdullah (@OmarAbdullah) January 11, 2025
Also Read: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు