Eknath Shinde: అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా.. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు: ఏక్‌నాథ్‌ షిండే

ఏక్‌నాథ్‌ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ హెచ్చరించారు. 2022లో తాను ప్రభుత్వాన్ని పడగొట్టిని విషయాన్ని కూడా మరోసారి గుర్తుకుచేశారు. ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వాళ్లు అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు.

New Update
Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు వస్తున్నాయని ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఏక్‌నాథ్‌ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ హెచ్చరించారు. ఈ మధ్య సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌(CM Devendra Fadnavis) సమావేశాలకు షిండే దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2022లో తాను ప్రభుత్వాన్ని పడగొట్టిని విషయాన్ని కూడా మరోసారి గుర్తుకుచేశారు. 

Also Read: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!

షిండే హయాంలో ఆమోదించిన ఓ ప్రాజెక్టును ఇప్పుడు ఫడ్నవీస్‌ సర్కార్‌ నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే శివసేన నేత షిండే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. '' నేను సాధారణ పార్టీ కార్యకర్తను. బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడిచిన మనిషిని. దీన్ని ప్రతీఒక్కరు అర్థం చేసుకోవాలి. 2022లో నన్ను అందరూ తేలిగ్గా తీసుకున్నారు. కానీ అప్పుడే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా. అసెంబ్లీలో మొదటి ప్రసంగంలో 200 కంటే ఎక్కువ వస్తాయని ఫఢ్నవీస్‌కు చెప్పా. 232 సీట్లు వచ్చాయి. అందుకే నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వాళ్లు అర్థం చేసుకుంటారని'' ఏక్‌నాథ్ షిండే అన్నారు.  

Also Read: అమెరికా డిపోర్టేషన్‌.. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదన్న కేంద్రం

దేవేంద్ర ఫడ్నవీస్‌కు హైకమాండ్ సీఎంగా బాధ్యతలు

ఇదిలాఉండగా మహారాష్ట్రంలో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతి కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఇందులో బీజేపీ 132 స్థానాల్లో గెలవగా.. శివసేన 57, అజిత్‌ పవార్‌ నేతృత్వంలో ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు హైకమాండ్ సీఎంగా బాధ్యతలు అప్పగించింది. ఇక ఏక్‌నాథ్ షిండే, అజిత్‌ పవార్‌లు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది. సీఎం పదవి ఇవ్వకపోవడంతో షిండే అసంతృప్తిగా ఉన్నారంటూ అప్పటినుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య మహాయుతి కూటమిలో విభేదాలు వచ్చాయని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో షిండే ఇలా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Love jihad : లవ్ జిహాద్.. బయటకు ఈడ్చుకొచ్చి ఊతికారేసిన బీజేపీ మహిళా లీడర్!

లవ్ జిహాద్ ఆరోపణల నేపథ్యంలో ఓ సెలూన్ షాపుపై దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ సెలూన్ షాపులో పనిచేసే హిందూ అమ్మాయిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడంటూ అర్మాన్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయిని చితకబాదారు.

New Update
love-jihad-bjp

love-jihad-bjp

లవ్ జిహాద్ ఆరోపణల నేపథ్యంలో ఓ సెలూన్ షాపుపై దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ సెలూన్ షాపులో పనిచేసే హిందూ అమ్మాయిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడంటూ అర్మాన్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయిని చితకబాదారు. ఈ ఘటన పూణేలోని కోత్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ గా మారింది.   బీజేపీ మహిళా మోర్చా కార్యకర్త ఉజ్వల గౌడ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి, అర్ష్ యునిసెక్స్ సెలూన్‌లోకి ప్రవేశించి, కస్టమర్లను బయటకు పంపించి అర్మాన్ ఖాన్ ను బయటకు ఈడ్చుకొచ్చి మరి దాడి చేశారు.  అర్మాన్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయి బలవంతంగా ఓ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలి నుండి తమకు ఫిర్యాదు అందిందని.. ఇష్టానికి విరుద్ధంగా ఇస్లాం మారాలని ఒత్తిడి చేస్తున్నాడని, ఆ అమ్మాయి మాట్లాడకుండా ఉండటానికి లక్ష రూపాయల కూడా చెల్లించినట్లుగా బాధితురాలు చెప్పినట్లుగా ఉజ్వల గౌడ్ ఆరోపించారు.  సెలూన్ మూసివేయాలంటూ  యజమాని జావేద్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.  

ఏడాది క్రితం పెళ్లి

అయితే లవ్ జిహాద్ కోణాన్ని పోలీసులు ఖండించారు. సెలూన్ యజమానికి, సంబంధిత మహిళకు మధ్య ఆర్థిక వివాదం ఉందని కోత్రుడ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సందీప్ దేశ్మనే స్పష్టం చేశారు. "ఆమెను బలవంతంగా కల్మా పారాయణం చేయించారని సూచించడానికి ఎటువంటి సాంకేతిక ఆధారాలు కనుగొనబడలేదు " అని తెలిపారు. తాము ఆమె వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా, వీడియోలో రికార్డ్ చేసామన్నారు పోలీసులు. ప్రాథమిక సమాచారం ప్రకారం  సెలూన్‌లో అర్మాన్, అమ్మాయికి ఏడాది క్రితం పెళ్లి జరిగింది. అయితే డబ్బు విషయంలో దంపతుల మధ్య వివాదం నెలకొంది. దీని తర్వాత అమ్మాయి ఒక స్నేహితుడిని సంప్రదించింది, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఆ అమ్మాయి హిందువు కాదని, క్రైస్తవురాలని తేలిందని పోలీసులు చెబుతున్నారు.  

 

 

Advertisment
Advertisment
Advertisment