Kumbh Mela Viral News: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

కుంభమేళాకు బీహార్ నుంచి ఏడుగురు యువకులు బోట్‌లో ప్రయాణించారు. గంగానదిలో 550 కిలో మీటర్లు 2 రోజుల్లో చేరుకున్నారు. రోడ్డు, రైలు మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉందని వీరు ఈ మార్గంలో వెళ్లారు. ఫిబ్రవరి 13న ప్రయాగ్‌రాజ్‌ సంగంలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగొచ్చారు.

New Update
boat journey to kumbh mela

boat journey to kumbh mela Photograph: (boat journey to kumbh mela)

Kumbh Mela Viral News: ఉత్తరప్రదేశ్‌(UP)లో కుంభమేళా సమయం దగ్గర పడతుండటంలో ప్రయాగ్‌రాజ్(Prayagraj) వెళ్లేవారి సంఖ్య అంతకంతా పెరుగుతుంది. దీంతో సందర్శకులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. గంటలు గంటలు రోడ్లపై వెయిట్ చేయాల్సి వస్తోంది. కుంభమేళాకు ట్రాఫిక్ లేకుండా చేరుకొవడానికి ఓ వ్యక్తి వినత్నంగా ఆలోచించాడు. ఫిబ్రవరి 8, 9 రోజుల్లో ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్‌లో రోడ్లపై ట్రాఫిక్‌ను చూసి వీరు అలా అయితే కుంభమేళా వెళ్లలేమనుకున్నారు. రైళ్లలో కూడా రద్దీ ఇంచుమించు అలానే ఉంది.

Also Read: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్‌ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..

550 కిలో మీటర్లు గంగానదిలో ప్రయాణం..

బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ 550 కిలో మీటర్లు గంగానదిలో ప్రయాణం చేశారు. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన ఏడుగురు వ్యక్తుల కలిసి ఈ సాహస యాత్ర చేశారు. వీరు ఫిబ్రవరి 11న బక్సర్ నుండి బయలుదేరి ఫిబ్రవరి 13న తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని సంగంలో పవిత్ర స్నానం ఆచరించారు. కేవలం రెండు రోజుల్లోనే వారు 550 కిలో మీటర్లు గంగా నదిలో ప్రయాణించారు. ప్రయాణ ఖర్చులు మొత్తం 20 వేలు అయ్యాయని యాత్రికులు చెబుతున్నారు.

Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో! 

మోటర్‌తో నడిచే బోట్‌ను ఉపయోగించారు. అనుకోని సంఘటనల వల్ల ఒక మోటర్ ఫెయిల్ అయితే సేఫ్టీ కోసం రెండు మోటర్లు పడవకు అమర్చారు. మోటర్ వేడిక్కడం వల్ల అప్పుడప్పుడు దాదాపు 5 కిలో మీటర్ల దూరం తెడ్డులతో పడవ నడిపామని వారు చెప్పారు. అంతేకాదు విశ్రాంతి లేకుండా రాత్రి పగలు పగవ ప్రయాణం చేశమని చెప్పారు. వారు షిఫ్టుల వారీగా వారి బోట్ నడిపారు. ప్రస్తుతం వీరి బోట్ జర్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

Also Read: దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment