Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్!

కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్‌ నుంచి ప్రయాగ్‌ రాజ్‌,కాశీ నగరాల మీదుగా బీహార్‌ కు వెళ్లే ,వచ్చే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.

New Update
maha kumbha mela 2025

maha kumbha mela 2025

అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌,కాశీ నగరాల మీదుగా బీహార్‌ కు వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ,అటు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.

Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

బుధవారం బయల్దేరాల్సిన ఇదే రైలును రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన రైల్వే బోర్డు ..ఇప్పుడు ఏకంగా నెలాఖరు వరకు రద్దు చేసింది. ఇటార్సి-ప్రయాగ్‌రాజ్‌ రూట్‌ లో..అదే విధంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్ కు నిత్యం వందల రైళ్లు నడుస్తున్నాయి.

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

రోడ్డు, వాయు మార్గాల్లో...

కానీ సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే ఏకైక రెగ్యులర్‌ రైలును బోర్డు ఏకపక్షంగా రద్దు చేయడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహా కుంభమేళాలో ఈ వారం మరింత కీలకం. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ఇది ముగుస్తుంది. రోడ్డు, వాయు మార్గాల్లో వెళ్లే వీలు లేకపోవడంతో సామాన్యులతో పాటు ఉన్నత స్థాయి కుటుంబాలూ రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాయి.

చాలా మంది కుంభమేళాతో పాటు పక్కనే ఉన్న కాశీ నగరంతో పాటు అయోధ్యకు వెళ్లి వస్తున్నారు. కుంభమేళాకు వెళ్లేందుకు నెలలు, వారాల ముందే టికెట్లు తీసుకున్న దాదాపు 36 వేల మంది ప్రయాణికులు రైలు రద్దుతో హతాశులయ్యారు.

సికింద్రాబాద్‌-దానాపూర్‌ రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌  ను రద్దు చేసిన రైల్వే బోర్డు..ఫిబ్రవరి 20 నుంచి 28 తేదీల్లో చర్లపల్లి -దానాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కానీ ఈ రైళ్లు నల్గొండ, విజయవాడ,భువనేశ్వర్‌ , పట్నా మీదుగా దానాపూర్‌ కు వెళ్తాయి. అటు ప్రయాగ్‌రాజ్‌ కానీ ఇటు కాశీ కానీ వెళ్లవు. 

Also Read: Rekha Gupta Net Worth : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment