Tihar Jail: త్వరలో తీహార్ జైలు తరలింపు.. ఎక్కడికంటే ?

తీహార్‌ను జైలును త్వరలో మరోచోటుకి మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఢిల్లీ సరిహద్దుల్లో తీహార్‌ జైలును ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు.

New Update
Tihar Jail

Tihar Jail

ఆసియాలో అతిపెద్ద జైలు ఏదంటే అందరికీ గుర్తుకొచ్చేది తీహార్‌ జైలు. అయితే ఈ జైలుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ జైలును మరో చోటుకు మార్చేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు సీఎం రేఖా గుప్తా శనివారం ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీ సరిహద్దుల్లో తీహార్‌ జైలును ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  

Also Read: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!

Thihar Jail Shift

జైలు విస్తీర్ణం, అందులో ఉండే ఖైదీల వల్ల చుట్టుపక్కల నివసించే వారి భద్రతను దృష్టిలో ఉంటుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు. అయితే తీహార్‌ జైలును 1958లో నిర్మించారు. ఇందులో మొత్తం 9 జైళ్లు ఉన్నాయి. 400 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. 1966కు మందు ఇది పంజాబ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది. ఆ ఏడాది తర్వాత దీని నిర్వహణను ఢిల్లీ ప్రభుత్వానికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఇది ప్రధాన జైలుగా ఉంది.  

Also read: ఏం స్కెచ్ వేశారమ్మా.. బ్యాంకులకు టోపీ పెట్టేందుకు కట్టుకున్న మొగుళ్లను!

ఢిల్లీలో ఇప్పుడు 19 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే తీహార్, మండోలి, రోహిణి.. ఈ మూడు జైళ్లు కూడా 10 వేల మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నాయి. ఖైదీల ఆగడాలను అడ్డుకునేందుకు ఈమధ్య అధికారులు గట్టిగా చర్యలు తీసుకుంటన్నారు. ఖైదీలు జైల్లో ఫోన్లు వినియోగించకుండా ఆపేందుకు ఆరుచోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు చెప్పారు. 

Also Read: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్‌ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?

Also Read: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!

 

tihar-jail | rtv-news | national-news | delhi | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్‌థౌఖోంగ్‌, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు.

New Update
terrorist arrest

terrorist arrest Photograph: (terrorist arrest)

భద్రతా దళాలు మణిపూర్‌లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో నిషేధిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అలాగే వారు వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌థౌఖోంగ్‌లో ఆదివారం ఓ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యున్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ధృవీకరించారు. తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ సభ్యుడిని అరెస్టు చేశాయి.

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

బిష్ణుపూర్ జిల్లాలోని లైషోయ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన సోదాల్లో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక SLR రైఫిల్‌తో కూడిన మ్యాగజైన్, ఒక కార్బైన్ మెషిన్ గన్, ఒక .303 రైఫిల్, ఒక డబుల్ బ్యారెల్ గన్, 48 రౌండ్ల మందుగుండు సామగ్రి, 2 గ్రెనేడ్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర వస్తువులు ఉన్నాయి. శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు భారీగా గన్స్ గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, బిష్ణుపూర్, తౌబాల్ మరియు తూర్పు ఇంఫాల్ సహా వివిధ జిల్లాల నుండి 2 నిషేధిత సంస్థలు- యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)లకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.

Advertisment
Advertisment
Advertisment